
ఇంద్రకీలాద్రిపై నవగ్రహ పునఃప్రతిష్ట
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఉదయం మండప పూజలు, మూలమంత్ర హవనం, అధివాసాలు వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం నవగ్రహ ప్రతిష్ట నిమ్తితం అవసరమైన యంత్రాలను ఆలయ అర్చకులు, వేద పండితులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మల్లేశ్వరాలయానికి ఊరేగింపుగా తీసుకు రాగా, కార్యక్రమంలో ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో 7–52 గంటలకు నవగ్రహ పునఃప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట జరిగింది. అనంతరం నూతన యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎల్డీ. ప్రసాద్, కోట ప్రసాద్ , మల్లేశ్వర శాస్త్రిలు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించగా, ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం వేద ఆశీర్వచనం, ప్రసాద వితరణ జరిగాయి. శుక్రవారం నుంచి నవగ్రహ మండపంలోని భక్తులను అనుమతించడం జరుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.
కంకిపాడు లాకులను
పరిశీలించిన ఇంజనీర్ల బృందం
కంకిపాడు: సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ ఇంజనీర్ల బృందం గురువారం కృష్ణాజిల్లా కంకిపాడు ఇరిగేషన్ సెక్షన్ను సందర్శించింది. ఇరువురు ఈఈల నేత్వత్వంలో పది మంది ఇంజనీర్ల బృందం కంకిపాడు లాకులు, అనుబంధ కాలువల లాకులు, గేట్లు, వాటి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు సేకరించారు. లాకులు పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకున్నట్లు బృందం నిర్ధారించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లాకులు నమూనాలను రూపొందించి పంపుతామని వెల్లడించింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో కాలువల పరిస్థితి, సాగు విస్తీర్ణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పరిశీలనలో ఇరిగేషన్ శాఖ కృష్ణా సెంట్రల్ డివిజన్ ఈఈ ఆర్.రవికిరణ్, మచిలీపట్నం డీఈ అపర్ణ, కంకిపాడు ఏఈ టీ.నాగబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రిపై నవగ్రహ పునఃప్రతిష్ట