ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ

Jun 3 2025 6:50 AM | Updated on Jun 3 2025 6:50 AM

ట్రాఫ

ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ

విజయవాడస్పోర్ట్స్‌: ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు ట్రాఫిక్‌ ఏడీసీపీ ప్రసన్నకుమార్‌ సోమవారం స్పోర్ట్స్‌ షూ, మాస్క్‌లు, హ్యాండ్‌ గ్లౌజులను అందజేశారు. సీ్త్ర శక్తిని ప్రోత్సహించే సదుద్దేశంతో పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఏడీసీపీ తెలిపారు. 33 మంది మహిళా కానిస్టేబుళ్లకు ఈ వస్తువులను అందజేశామని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి నలు గురి ప్రాణాలు కాపాడిన నలుగురు కానిస్టేబుళ్లకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏసీపీ పి.రామ చంద్రరావు, సీఐ బాలమురళీకృష్ణ, ఎస్‌ఐ నాగ దుర్గ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా జేసీగా

ఇలక్కియ బాధ్యతల స్వీకారం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఎస్‌.ఇలక్కియ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జేసీ ఇలక్కియ మాట్లాడుతూ.. జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులతో కలిసి కృషి చేస్తానన్నారు. తాను గతంలో రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌గా, కాకినాడ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసినట్లు తెలిపారు. నూతన జాయింట్‌ కలెక్టర్‌కు విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, డీఎస్‌ఓ ఎ.పాపారావు, గ్రామ/వార్డు సచివా లయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కలెక్టరేట్‌ ఏఓ ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ఔషధ మొక్కలపై

అవగాహన కలిగిద్దాం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఔషధ మొక్కల ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో వన్‌ ఎర్త్‌–వన్‌ లైఫ్‌ (టెర్రస్‌ గార్డెన్‌ గ్రూప్‌) సహకారంతో ఏర్పాటుచేసిన ధన్వంతరి వనాన్ని కలెక్టర్‌ లక్ష్మీశ సోమవారం ప్రారంభించారు. అక్కల కర్ర, నల్ల ఉమ్మెత్త, నేపాలం, చిత్రమూలం, తాని తదితర ఔషధ గుణాలు కలిగిన 40 రకాల ఔషధ మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వయంగా మొక్కనాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆరోగ్యకరంగా జీవించడానికి పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు సేంద్రియ పద్ధతిలో పంటలను పండించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంద న్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంపై పెద్దఎత్తున రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడే ఔషధ మొక్కలపైనా అవగాహన కల్పించి, ఇంట్లోనే పెంచుకునేలా ప్రోత్సహించడంలో సమష్టి కృషి అవసరమన్నారు. మిద్దె తోటల పెంపకాన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్లేందుకు వన్‌ ఎర్త్‌ – వన్‌ లైఫ్‌ చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్‌ లక్ష్మీశ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వన్‌ ఎర్త్‌–వన్‌ లైఫ్‌ ప్రతినిధులు ఏలూరి లీలా కుమారి, మద్దిరాల కమలాకర్‌, విజయకుమార్‌ వెలగ, పాలడుగు సురేష్‌ తదితరులతో పాటు పీసీబీ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ పి.శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ1
1/2

ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ

ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ2
2/2

ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement