కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు | - | Sakshi
Sakshi News home page

కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు

May 29 2025 1:21 AM | Updated on May 29 2025 1:21 AM

కోటలు

కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు

పథకాలన్నీ గడప వద్దకే..
ఈ ఫొటోలోని మహిళ పేరు చింతలచెరువు పద్మావతి. ఈమెది జి. కొండూరు మండలంలోని గంగినేని గ్రామం. భర్త అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందారు. ఈమెకు కుమారులు వెంకటేశ్వరరావు, వెంకటకృష్ణ. ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. పద్మావతి కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాల వల్ల రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరింది. 2019 నుంచి ఐదేళ్ల పాటు పింఛన్‌ రూపంలో రూ.1,21,500, వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రూ.72,951, సున్నా వడ్డీ పథకం కింద రూ.5,355, వైఎస్సార్‌ చేయూత పథకం కింద 56,250, రైతు భరోసా పథకం కింద రూ.21,000, జగనన్న తోడు పథకం కింద రూ.20,000, అమ్మ ఒడి పథకం కింద రూ.81,000, వాహనమిత్ర కింద రూ.20,000, ఇంటి స్థలం, పక్కాగృహం ఒక్కొక్కటి చొప్పున అందుకున్నారు. ఈ పథకాలన్నీ అర్హతే ప్రామాణికంగా ఆమెకు అందాయి. ఏ ప్రభుత్వ కార్యాలయం కానీ, అధికారుల చుట్టూ కానీ తిరగకుండా.. గ్రామ వలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి, వివరాలు నమోదు చేసుకొని పథకాలు అందించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌ మినహా ఏ ఒక్క పథకం ఆమె కుటుంబానికి అందలేదు.
● వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం ● నిర్దాక్షిణ్యంగా గ్రామ/వార్డు వలంటీర్ల తొలగింపు ● ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీని నిలిపివేస్తూ ఆదేశాలు ● రైతు భరోసా కేంద్రాలు అంతంతమాత్రమే ● కనిపించని ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ● ప్రజలను కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్న వైనం ● గత ప్రభుత్వ హయాంలో ఇంటి గడప వద్దకే ప్రభుత్వ పాలన

ఉమ్మడి కృష్ణాజిల్లా సమాచారం

రేషన్‌ కార్డులు 11,12,832

రేషన్‌ పంపిణీ వాహనాలు 710

రేషన్‌ పంపిణీ సిబ్బంది 1420

గ్రామ సచివాలయాలు 670

రైతు భరోసా కేంద్రాలు 630

గ్రామ వలంటీర్లు 18,547

పెన్షన్‌ లబ్ధిదారులు 4,59,125

వెల్‌నెస్‌ సెంటర్లు 614

ఇంటికే సంక్షేమం.. ఇంటికే రేషన్‌.. ఇంటికే వైద్యం..

ఇంటికే పౌర సేవలు.. వెరసి ప్రజలను తమ గడప దాట నీయకుండా సాగింది గత ప్రభుత్వంలోని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంస్కరణల పాలన. గ్రామ సచివాలయ వ్యవస్థ.. దానికి అనుబంధంగా వలంటీర్లు.. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు దానికనుబంధంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం.. ఎండీయూ వాహనాలతో రేషన్‌ కూడా డోర్‌ డెలివరీ చేసి దేశంలోనే ది బెస్ట్‌ అనిపించుకునేలా సేవలందించారు. సీన్‌ కట్‌ చేస్తే..

కూటమి అధికారం చేపట్టిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రగతి ‘గడప’దాటడం లేదు.. వచ్చీరాగానే వలంటీర్లకు గుడ్‌ బై అన్నారు.. లేటెస్ట్‌గా ఎండీయూ వాహనాలకు టాటా చెప్పేశారు.. ఫ్యామిలీ డాక్టర్‌ను నెమ్మదిగా రిటైర్‌ చేసేస్తున్నారు. మొత్తంగా ఇంటికే ప్రభుత్వ సేవల కాన్సెప్ట్‌కే స్వస్తి పలికేసి.. ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేలా చేస్తున్నారు. అంతటా కూటమి నేతల స్వార్థపూరిత, కక్షపూరిత రాజకీయాలతో సంక్షేమం జాడైనా లేకుండా.. అభివృద్ధి ఏ కోశానా కనిపించకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. – జి.కొండూరు

కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు 1
1/4

కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు

కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు 2
2/4

కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు

కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు 3
3/4

కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు

కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు 4
4/4

కోటలు దాటిన కూటమి మాటలు.. చేతల్లో కోతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement