కరాటే పోటీల్లో విజయవాడ క్రీడాకారుల సత్తా | - | Sakshi
Sakshi News home page

కరాటే పోటీల్లో విజయవాడ క్రీడాకారుల సత్తా

May 29 2025 1:21 AM | Updated on May 29 2025 1:21 AM

కరాటే పోటీల్లో విజయవాడ క్రీడాకారుల సత్తా

కరాటే పోటీల్లో విజయవాడ క్రీడాకారుల సత్తా

విజయవాడస్పోర్ట్స్‌: నేపాల్‌లో జరిగిన 11వ అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజయవాడ క్రీడాకారులు జె.శ్రీఆదిత్యరావ్‌, షేక్‌ అనీఫ్‌, ఐ.ఈశ్వర్‌సాయి, బి.ఈశ్వర్‌దుర్గ, ఎం.అనీష్‌కుమార్‌, పి.కుషాల్‌ సత్తా చాటారు. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన ఈ పోటీలకు శ్రీలంక, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మలేషియా, నేపాల్‌, భారత దేశాల క్రీడాకారులు పోటీ పడ్డారు. ఈ పోటీల్లో ఆదిత్యరావ్‌ కుమితే విభాగంలో గోల్డ్‌, కటా విభాగంలో బ్రాంజ్‌, హనీష్‌ కటాలో గోల్డ్‌, కుమితేలో బ్రాంజ్‌, ఈశ్వర్‌సాయి కుమితేలో గోల్డ్‌, కటాలో బ్రాంజ్‌, ఈశ్వర్‌దుర్గ కుమితేలో సిల్వర్‌, కటాలో బ్రాంజ్‌, అనీష్‌కుమార్‌ కటాలో సిల్వర్‌, కుమితేలో బ్రాంజ్‌, కుషాల్‌లో కటాలో సిల్వర్‌ కుమితేలో బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారు. వీరంతా నగరంలోని వాడో–ర్యు కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను అకాడమీ డైరక్టర్‌ జె.ఎం.దాస్‌, ఇన్‌స్ట్రక్టర్‌ ఆరీఫ్‌ పాషా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement