రూ.16.80 లక్షలతో అంచనాలు తయారు | - | Sakshi
Sakshi News home page

రూ.16.80 లక్షలతో అంచనాలు తయారు

May 29 2025 1:21 AM | Updated on May 29 2025 1:21 AM

రూ.16.80 లక్షలతో అంచనాలు తయారు

రూ.16.80 లక్షలతో అంచనాలు తయారు

పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు ఎత్తిపోతల పథకం మరమ్మతులకు రూ.16.80 లక్షలతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్లు ఏపీఎస్‌ఐడీసీ విజయవాడ డివిజన్‌ ఈఈ బి.రత్నరాజు తెలిపారు. ఈనెల 28న ‘సాక్షి’ దినపత్రికలో ‘‘ఎత్తిపోతలు..ఎదురు చూపులు’’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా ఈఈ రత్నరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెనుగంచిప్రోలు మునేరు పక్కన 2465.92 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు సుమారుగా 17.23 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించామని, 2018లో పథకానికి శంకుస్థాపన జరగగా 2021లో పూర్తి చేశామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటినుంచి సాగునీరు రైతులకు అందిస్తున్నామన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వరదలకు ఎత్తిపోతల పథకంలోని పంపులు, మోటార్‌లు, పానెల్‌ బోర్డు, 2 ట్రాన్స్‌ఫార్మర్‌లు, వీసీబీ పానెల్‌ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయని, విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయన్నారు. వరద తగ్గిన తరువాత అధికారులు పథకాన్ని పరిశీలించి రూ.16.80 లక్షలతో వివరణాత్మక అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement