
కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గూపన్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లింగన్న అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. సాయంత్రం నిర్వహించిన ఆయన అంత్యక్రియలకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్ హాజరై పాడె మోశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. లింగన్న అకాల మృతి పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే అన్నారు.
కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు విశేష కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు. అంత్యక్రియల్లో పార్టీ జిల్లా నాయకులు బాగిర్తి బాగారెడ్డి, లింగం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అదుపుతప్పి బోల్తాపడిన లారీ
పెద్దకొడప్గల్: మండలంలోని బేగంపూర్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఆదివారం ఉదయం వేకువజామున హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న లారీ బేగంపూర్ చౌరస్తాలో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
నల్లా నీటిలో జలగలు
నిజాంసాగర్(జుక్కల్): ఒడ్డేపల్లిలో నల్లా నీటిలో జలగలు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కుళాయిల ద్వారా జలగలు రావడంతో నీటిని తాగేది ఎలా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులుగా జలగలు వస్తున్నాయని పంచాయ తీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి కుళాయి జలగలు రాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం