ఒత్తిడి జయించలేక.. | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడి జయించలేక..

Jul 20 2025 5:35 AM | Updated on Jul 20 2025 5:35 AM

ఒత్తిడి జయించలేక..

ఒత్తిడి జయించలేక..

నిజాంసాగర్‌/ఆర్మూర్‌ టౌన్‌ : పదో తరగతి వరకు తెలుగు మీడియం చదువుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థి ఇంటర్‌లో ఆంగ్లమాధ్యమ చదు వు అర్థంకాక తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. చివరికి అనంతలోకాలకు వెళ్లిన విషాద ఘటన ఇది. వివ రాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగ ర్‌ మండలం ఆరేడ్‌ గ్రామానికి చెందిన గడ్డం నిర్మ ల, నాగయ్య దంపతులకు ముగ్గురు కుమారులు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని పిల్లలను చదివిస్తున్నా రు. చిన్న కుమారుడైన సంతోష్‌ (17) ఐదో తరగతి నుంచి 10 వ తరగతి వరకు అచ్చంపేట ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించాడు. తెలుగుమీడియం చదువుల్లో ఉత్తమ మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా వేల్పూర్‌ ఎస్సీ గురుకుల పాఠశాలలో సీటు వచ్చింది. పదో తరగతి వరకు తెలుగు మీడి యం చదివి ఇంటర్‌లో ఇంగ్లిష్‌ మీడియం కావడంతో ఒత్తిడికి గురయ్యాడు. ఇంట ర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. సప్లిమెంటరీలో ఒకటి మాత్రమే పాస్‌ కావడంతో మానసికంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. శనివారం వేకువ జామున సంతోష్‌ తాను చదువుతున్న గురుకుల పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి మైదానంలో వ్యాయామం చేశాడు. అనంతరం సంతోష్‌ తువ్వాలు తీసుకుని కళాశాల గోడ దూకి బయటకు వెళ్లినట్లు సమాచారం. కొద్ది సేపటి తర్వాత డిగ్రీ కళాశాల వెనుక ఉన్న నర్సరీలో చెట్టుకు ఉరేసుకుని కనపడ్డాడు. ఇదిలా ఉండగా సంతోష్‌ ఆత్మహత్యపై అతడి సోదరుడు శ్రీకాంత్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో చాలామంది ఫెయిల్‌ అయ్యారని పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వచ్చి రెండు నెలలవుతోందని, ఇప్పుడెందుకు ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. కళాశాలలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి విచారణ జరిపించాలని కోరా రు. సంతోష్‌ ఆత్మహత్యతో ఆరేడ్‌ గ్రామంలో విషా దఛాయలు అలుముకున్నాయి.

తనువు చాలించిన ఇంటర్‌ విద్యార్థి

అర్థం కాని ఆంగ్లమాధ్యమ చదువు

పదో తరగతి వరకు

తెలుగు మీడియంలో విద్యాభ్యాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement