
రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడి మృతి
నిజామాబాద్ రూరల్: మే డ్చల్ జిల్లా దుండిగల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రూరల్ మండలం కేశాపూర్కు చెందిన ఓ బాలుడు మృతి చెందాడు. బాలుడి పై నుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రూరల్ మండలం కేశాపూర్కు చెందిన గుడిపల్లి రాజ్కుమార్ నిహారిక భార్యాభర్తలు. వీరు మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధి మల్లంపేట్లో గత ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరికి అభిమాన్షు(6) కుమారుడు, ఓ పాప ఉన్నారు. స్థానిక గీతాంజలి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం తన తల్లి నిహారికతో కలిసి ఇంటి నుంచి స్కూటీపై పాఠశాలకు బయలుదేరాడు. మార్గమధ్యలో పల్లవి స్కూల్ జంక్షన్ దగ్గరికి రాగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ స్కూటీని తాకింది. దీంతో బాలుడు స్కూటీపై నుంచి టిప్పర్ చక్రాల కిందపడిపోయాడు. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రెప్పపాటు కాలంలో జరిగిన ప్రమాదంలో కుమారుడిని కోల్పోయనంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. దీంతో బాధిత కు టుంబ సభ్యులు స్వగ్రామమైన కేశాపూర్లో సా యంత్రం బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడి తల్లితండ్రులు రోదించిన తీరు గ్రామస్తులను కంటితడి పెట్టించింది. బాలుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
మేడ్చల్ జిల్లా దుండిగల్లో ఘటన