పసుపు రైతులు సంబురాలు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పసుపు రైతులు సంబురాలు చేసుకోవాలి

Jun 28 2025 5:43 AM | Updated on Jun 28 2025 8:50 AM

పసుపు రైతులు సంబురాలు చేసుకోవాలి

పసుపు రైతులు సంబురాలు చేసుకోవాలి

ఆర్మూర్‌: జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా బహిరంగ సభను విజయవంతం చేసి రైతులు సంబురాలు చేసుకోవాలని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో శుక్రవారం బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాటూరి తిరుపతిరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 29న జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ గ్రౌండ్‌లో నిర్వహించే పసుపు రైతుల సమ్మేళనాన్ని గొప్పగా జరుపుకోవాలన్నారు. ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌లోని 250 పసుపు రైతు సంఘాల సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement