
బ్లాక్లాగ్ పరీక్షలు నిర్వహించండి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పీజీ బ్యాక్లాగ్ పరీక్షలను నిర్వహించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తెయూ కంట్రోలర్ సంపత్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతాచారి, వర్సిటీ అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. వచ్చే సెమిస్టర్ పరీక్షల సమయంలో వర్సిటీ విద్యార్థులకు రెగ్యులర్ పరీక్షలతో పాటు బ్లాక్లాగ్ పరీక్షలను నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో వర్సిటీ ఏబీవీపీ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ అక్షయ్, నాయకులు పృథ్వీ, మనోజ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.