డిచ్‌పల్లి సీఐగా వినోద్‌ రెడ్డి | - | Sakshi
Sakshi News home page

డిచ్‌పల్లి సీఐగా వినోద్‌ రెడ్డి

Jun 14 2025 10:10 AM | Updated on Jun 14 2025 10:10 AM

డిచ్‌

డిచ్‌పల్లి సీఐగా వినోద్‌ రెడ్డి

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి సర్కిల్‌ ఇనన్‌స్పెక్టర్‌గా కాడారి వినోద్‌ రెడ్డి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా ఖమ్మం జిల్లా ట్రాన్స్‌కో విభాగంలో సీఐగా పని చేస్తున్న వినోద్‌రెడ్డి డిచ్‌పల్లి సీఐగా బదిలీపై వచ్చారు. ఇదివరకు డిచ్‌పల్లి సీఐగా పని చేసిన కొంక మల్లేష్‌ ఐజీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ మాట్లాడుతూ.. ఏవైనా సమస్యలు ఉంటే బాధితులు పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. బాధ్యతలు స్వీకరించిన సీఐ వినోద్‌ రెడ్డిని ఎస్సై మహ్మద్‌ షరీఫ్‌, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

జాదూ రంగనాథ్‌కు సన్మానం

నిజామాబాద్‌ రూరల్‌: జాదూ యుగంధర్‌ రంగనాథ్‌ను జిల్లా బాలభవన్‌ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. తెలుగువారి ఆహ్వానం మేరకు పశ్చిమ అమెరికా వెళుతున్న సందర్భంగా రంగనాథ్‌ను ఘనంగా సన్మానించారు. బాలభవన్‌కు ఆయన చేసిన సేవలను కొనియాడారు. బాలభవన్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ఉమాబాల, విశ్రాంత ఉద్యోగి విఠల్‌ ప్రభాకర్‌, వెంకటలక్ష్మి, లక్ష్మణ్‌, పుష్పలత, లలిత పాల్గొన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడికి..

నిజామాబాద్‌ నాగారం: మాలలకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ని మాల మహనాడు ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలిసి ఘనంగా సన్మానించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, నాయకులు గడుగు గంగాధర్‌, ఎడ్ల నాగరాజ్‌, వెంకటేష్‌, ఎల్లయ్య, అలుక కిషన్‌, దేవదాస్‌, వినయ్‌, గంగాధర్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల

నిర్మాణ పనుల పరిశీలన

డిచ్‌పల్లి: వెస్లీనగర్‌ తండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఎంపీడీవో బూక్య లింగం నాయక్‌ పరిశీలించారు.ఆయన మాట్లాడుతూ.. వెస్లీనగర్‌ తండాకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కా గా అందులో ఆరు ఇళ్ల నిర్మాణ పనులు చు రుగ్గా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని పేదలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. మాజీ సర్పంచ్‌లు అంబర్‌ సింగ్‌, బోడ సునీత రఘు, పంచాయతీ కార్యదర్శి శ్రావణి, లబ్ధిదారులున్నారు.

ఆర్థిక సహాయం

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామానికి చెందిన బట్టు నాగార్జున కుటుంబానికి గౌడ సంఘం ఆర్మూర్‌ మండల అధ్యక్షుడు గడ్డమీది లింగం గౌడ్‌ శుక్రవారం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామానికి చెందిన నాగార్జున నెల రోజుల క్రితం బతుకుదెరు వు కోసం అబుదాబి వెళ్లి అదృశ్యమయ్యాడు. దీంతో లింగం గౌడ్‌ బాధిత కుటుంబ సభ్యులకు చేయూతనందిస్తూ ఆర్థిక సహాయం చేశా రు. బీజేవైఎం మండల అధ్యక్షుడు వేల్పుల సతీష్‌, మేడిపల్లి సాగర్‌, వేల్పుల లక్కీ, మేడిపల్లి గిరీష్‌, రాజు, రాఘవ పాల్గొన్నారు.

డిచ్‌పల్లి సీఐగా వినోద్‌ రెడ్డి 
1
1/3

డిచ్‌పల్లి సీఐగా వినోద్‌ రెడ్డి

డిచ్‌పల్లి సీఐగా వినోద్‌ రెడ్డి 
2
2/3

డిచ్‌పల్లి సీఐగా వినోద్‌ రెడ్డి

డిచ్‌పల్లి సీఐగా వినోద్‌ రెడ్డి 
3
3/3

డిచ్‌పల్లి సీఐగా వినోద్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement