
నూతన కార్యవర్గం ఎన్నిక
ఖలీల్వాడి: నిజామాబాద్ అర్బన్ న్యూస్ పేపర్ ఏజెంట్స్ అండ్ బాయ్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నగరంలోని జంపాల చంద్రశేఖర్ ట్రస్ట్ గ్రంథాలయంలో ఎన్నికలు నిర్వహించారు. రణం రవీందర్ గౌడ్ 15 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా, ప్రధాన కార్యదర్శిగా దూస రవికుమార్, కోశాధికారిగా కొక్కొండ రాజగోపాల్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వనమాల సత్యం, నిజామాబాద్ అర్బన్ గౌరవ సలహాదారులు బుచ్చిలే తుకారాం, సిర్న లక్ష్మీకాంతం ఎన్నికలను పర్యవేక్షించి ఫలితాలను ప్రకటించారు.