
మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాంపల్లి
నిజామాబాద్నాగారం: మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రేణిగుంట నాంపల్లిని ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ప్రసాద్ను నియమించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 1996 నుంచి క్రియాశీలకంగా వర్గీకరణ సాధన కోసం పనిచేసినందుకు నాంపల్లిని నియమించారు. ఈ సందర్భంగా నాంపల్లి మాట్లాడుతూ..సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా స్థానం కల్పించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగకు మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ప్రసాద్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తన వృంతు కృషి చేస్తానని తెలిపారు.
హోరాహోరీగా పట్టణ
పద్మశాలి సంఘం ఎన్నికలు
నిజామాబాద్నాగారం: నిజామాబాద్ పట్టణ(నగర) పద్మశాలి సంఘం ఎన్నికలు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. వర్ని రోడ్డులో గల పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిగింది. నగరంలో మొత్తం 68 పద్మశాలీ సంఘం తర్పలు.. 5,245 ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,917 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి, న్యాయ వాది గంగాప్రసాద్ వెల్లడించారు. 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా మూడు ప్యానళ్లు పోటీలో ఉండగా, డాక్టర్ శ్రీవనం దేవీదాస్ ప్యానెల్(బాణం గుర్తు), శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ ప్యానెల్(చక్రంగుర్తు)ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తుది ఫలితం అర్ధరాత్రి వెలువడే అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి
ధర్పల్లి: ఛత్తీస్గడ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కర్రి గుట్టలో మావోయిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఆదివాసులను, మావోయిస్టులను కిరాతకంగా చంపుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపి, అడవి సంపదలను ఆదివాసులకు చెందేలా విధివిధానాలను రూపొందించాలని కోరారు. నాయకులు బాలయ్య, కారల్ మార్క్స్ , పోశెట్టి, నిమ్మల భూమేష్, గులా హుస్సేన్, తదితరులు ల్గొన్నారు.
జ్ఞాన సమాజ
నిర్మాణమే స్వేరోల లక్ష్యం
జక్రాన్పల్లి: పడకల్ గ్రామంలో ఆదివారం స్వేరో విక్టరీ డేను నిర్వహించారు. ప్రపంచంలో ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ విజయాన్ని పురస్కరించుకొని విక్టరీ డేను నిర్వహించి పదవ తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించినట్లు స్వేరో రాష్ట్ర నా యకులు సాయి తెలిపారు. చదువు విషయంలో ఎల్లవేళలా విద్యార్థులకు స్వేరో నెట్వర్క్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. నా యకులు ఆశన్న, పిల్లి సంజీవ్, ప్రసాద్, పిల్లి గ ణేష్,సౌందర్య, మణిదీప్ పాల్గొన్నారు.
దళితరత్న అవార్డు గ్రహీతకు సన్మానం
సిరికొండ: గడ్కోల్లో దళితరత్న అవార్డు గ్రహీత, మాల మహనాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి హేమంత్కుమార్ను మాల సంఘంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. సంఘం నిజామాబాద్ రూరల్ అధ్యక్షుడు సుంకరి రాకేష్, సంఘం పెద్ద మనుషులు తలారి గంగబాపు, తలారి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాంపల్లి

మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాంపల్లి

మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాంపల్లి