ఉగ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం

May 26 2025 12:51 AM | Updated on May 26 2025 12:51 AM

ఉగ్రవ

ఉగ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం

సుభాష్‌నగర్‌: దేశంలో ఉగ్రవాదం, నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేతకు కేంద్రం చర్యలు చేపట్టిందని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలోభాగంగా నగరంలోని మార్వాడీగల్లి 43వ బూత్‌నెంబర్‌లో నాయకులు, కార్యకర్తలతో కలిసి అర్బన్‌ ఎమ్మెల్యే.. ప్రధాని మోదీ సందేశాన్ని వీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధాని మోదీ జాతినుద్దేశించి గొప్ప సందేశాన్ని ఇచ్చారన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సైన్యం చూపిన వీరత్వానికి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయని తెలిపారు. ఆపరేషన్‌ కగార్‌తో 2026 మార్చిలోపు దేశంలో నక్సలిజాన్ని నామరూపం లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో దేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిందని, సంగారెడ్డిలో డ్రోన్‌ ద్వారా 50 ఎకరాల్లో మహిళలు పొలాలకు స్ప్రే చేసిన విధానమే అందుకు నిదర్శనమన్నారు. ప్రపంచ యోగా దినోత్సవంలో జూన్‌ 21న ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సీతారాం పాండే, కమల్‌, కృష్ణ, గోపాల్‌, వినయ్‌, ధన్‌రాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

అగ్రవర్ణ పేదలకు ‘ఈడబ్ల్యూఎస్‌’ వరం

సుభాష్‌నగర్‌: అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వరం లాంటిదని, బీజేపీ ప్రభుత్వం పేదలకు విద్య, ఉద్యోగాల్లో ఉపయోగపడే విధంగా రిజర్వేషన్‌ను తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని మాణిక్‌భవన్‌ స్కూల్‌లో ఆర్యవైశ్య అఫీషియల్స్‌, ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారం–2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ..అగ్రవర్ణ కులాల్లోని పేదలు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. అనంతరం పదోతరగతి, ఇంటర్మీడియేట్‌, ఎంసెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను డీఈవో అశోక్‌తో కలిసి సన్మానించి మెడల్స్‌ను అందజేశారు. అసోసియేషన్‌ ప్రతినిధులు ధన్‌పాల్‌ శ్రీనివా స్‌, ఇంగు ప్రసాద్‌, రవీందర్‌, భోజరాజు, చిరంజీవ రాజు, రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ

సిరికొండలో మన్‌కీ బాత్‌ వీక్షణ

సిరికొండ: ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో బీజేపీ నాయకులు టీవీలో వీక్షించారు. ప్రధాని 122వ మన్‌ కీ బాత్‌లో మాట్లాడిన అంశాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించనున్నట్లు బీజేపీ జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్‌ తెలిపారు. పార్టీ మండలాధ్యక్షుడు గుర్రపు సంజీవ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం 1
1/2

ఉగ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం

ఉగ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం 2
2/2

ఉగ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement