
ఆర్టిజన్లపై పనిభారం తగ్గించాలి
సుభాష్నగర్:విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తు న్న ఆర్టిజన్ల డ్యూటీలు సర్క్యులర్ ప్రకారం పని భా రం తగ్గించాలని టీవీఏసీ జేఏసీ, సీఐటీయూ ఆధ్వ ర్యంలో నిజామాబాద్ డీఈ శ్రీనివాస్కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆర్టిజన్లు పనిభారంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన డీఈ తాము ఎస్ఈ ఇచ్చిన సర్క్యులర్కు అనుగుణంగానే డ్యూ టీలు చేయిస్తామని హామీనిచ్చారు. జేఏసీ ప్రతినిధులు నల్లూరు నరేష్, బట్టు గంగాధర్, పాకాల మహేష్, ప్రభాకర్, జాదవ్ మురళీ కుమార్, రవీందర్, థామస్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.