
సజ్జ రైతును ముంచిన వాన
బాల్కొండ: అకాల వర్షాలు సజ్జ రైతును నిండా ముంచాయి. వరుసగా కురిసిన వర్షాలతో కోసిన సజ్జతోపాటు మొక్కలపైనే సజ్జ కంకులకు మొలకలు వచ్చాయి. దీంతో మొలకెత్తిన సజ్జ పంటను కొనుగోలు చేయబోమని సీడ్ వ్యాపారులు తేల్చి చెపుతున్నారు. ఆర్మూర్ డివిజన్లో సుమారు 30 వేల ఎకరాల వరకు రైతులు సజ్జ సాగు చేశారు. 50 శాతం మేర కోతలు పూర్తికాగా, మిగతా పంటలపై వర్షం ప్రభావం పడింది. దీంతో ఒక్కో రైతు ఎకరానికి సుమారు రూ.లక్ష నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. తడిసి మొలకెత్తిన సజ్జ పంటను రైతులు పశువుల దాణా మార్కెట్లో క్వింటాల్ రూ.వెయ్యికి విక్రయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది.
ఎకరానికి రూ.లక్ష నష్టపోతున్నాం
వర్షాలతో తడిసి మొలకెత్తిన సజ్జ పంటను వ్యాపారులు కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పారు. ఆరు రోజులుగా రెక్కలు ముక్కలు చేసుకొని ఆరబెడుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఎకరానికి రూ.లక్ష నష్టపోతున్నాం. ప్రభుత్వం సజ్జ రైతులను ఆదుకోవాలి. – జంగం గంగాధర్, రైతు, రెంజర్ల

సజ్జ రైతును ముంచిన వాన