దేవాలయాల నిర్మాణకర్త అహల్యాబాయి | - | Sakshi
Sakshi News home page

దేవాలయాల నిర్మాణకర్త అహల్యాబాయి

May 25 2025 10:56 AM | Updated on May 25 2025 10:56 AM

దేవాలయాల నిర్మాణకర్త అహల్యాబాయి

దేవాలయాల నిర్మాణకర్త అహల్యాబాయి

సుభాష్‌నగర్‌:లోకమాత,మహారాణి అహల్యాబా యి హోల్కర్‌ హిందూ దేవాలయాల నిర్మాణకర్త అ ని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు. అహల్యాబాయి హోల్కర్‌ 300వ జయంతి ఉత్సవాల సందర్భంగా నగరంలో ని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ, హారతి కార్యక్రమాలు నిర్వహించారు.అహల్యాబాయి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ద్వారక, వారణాసి, ఉజ్జయిని, నాసిక్‌, గయ, వైద్యనాథ్‌ సహా వందలాది దేవాలయాలు, ధర్మశాలల నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు. 1780లో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ, మరమ్మతులో ఆమె కృషి ఉందన్నారు. అహల్యాబాయి పాలనలో పక్షపాతం లేకుండా న్యాయ పరిపాలన నిర్వహించడంలో ఖ్యాతిని సంపాదించిందని, అందుకు ఆమె ఏకై క కుమారుడిని చితకబాది మరణశిక్ష విధించడమే నిదర్శనమన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసిన ఇందిరాగాంధీ చరిత్ర కాకుండా అహల్యాబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి, ఛత్రపతి శివాజీని తయారు చేసిన జిజియాబాయి వంటి ధీర వనితల చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. హిందువులు దేవాలయాలపై జరుగుతున్న దాడులను హిందువులంతా సంఘటితమై ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, గోపిడి స్రవంతిరెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్‌ పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్‌ ప్రవళిక, జ్యోతి, బీజేపీ మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement