
‘సాక్షి’పై కక్ష సాధింపు సరికాదు
ఎల్లారెడ్డి: సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం స రికాదని జర్నలిస్టులు పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడిని శుక్రవారం ఎల్లారెడ్డి జర్నలిస్టులు ఖండించారు. నిజాలను బయట పెడుతున్న సా క్షి పత్రికపై తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సా ధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. అనంతరం ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాల యంలో ఇన్చార్జి ఏవో చంద్రశేఖర్కు వినతిపత్రం సమర్పించారు. ఎన్యూజే జాతీ య ఉపాధ్యక్షులు రాజేందర్నాథ్, జర్నలిస్టులు రామప్ప, మహేష్, సిద్దు, యశ్వంత్ పవార్, సంగ్రాం, నాగేశ్వర్రావు, శ్రీనివాస్, రాజ్కుమార్, శివకుమార్ పాల్గొన్నారు.