
నీట్ పరీక్షకు 3,298 మంది హాజరు
నిజామాబాద్అర్బన్: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా అధికారులు ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,398 మంది అభ్యర్థులకు 3,298 మంది పరీక్షకు హాజరుకాగా, 100 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. సెంటర్ నిర్వాహకులు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ముగ్గురు అభ్యర్థులు, బోధన్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముగ్గురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల వద్ద పరీక్ష నిర్వహణ అధికారులు, పోలీసు సిబ్బంది మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థులను తనిఖీలు చేయాలని పరీక్షల నిర్వహణ అధికారులు పోలీసులకు తెలిపారు. తనిఖీలు చేసే బాధ్యత తమది కాదని కేవలం సెక్యూరిటీ మాత్రమే తమదని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.
సెంటర్ల వారీగా హాజరైన అభ్యర్థుల వివరాలు
నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో 720 మంది అభ్యర్థులకు 705 మంది హాజరుకాగా, 15 మంది గైర్హాజరయ్యారు. తెలంగాణ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో 456 మంది అభ్యర్థులకు 438 మంది హాజరు కాగా 18 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కేంద్రంలో 384 మంది అభ్యర్థులకు 374 మంది హాజరుకాగా 10 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బోధన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 432 మంది అభ్యర్థులకు 420 మంది హాజరుకాగా, 12 మంది గైర్హాజరయ్యారు. బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 432 మంది అభ్యర్థులకు 422 మంది పరీక్ష రాయగా, 10 మంది హాజరుకాలేదు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 384 మంది అభ్యర్థులకు 373 మంది హాజరుకాగా, 11 మంది గైర్హాజరయ్యారు.
నాగారంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో 312 మందికి గాను 304 మంది పరీక్ష రాయగా, 8 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో 278 మంది అభ్యర్థులకు 262 మంది హాజరుకాగా, 16 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
రెండు కేంద్రాల్లో ఆలస్యంగా
వచ్చిన అభ్యర్థులు
లోనికి అనుమతించని అధికారులు

నీట్ పరీక్షకు 3,298 మంది హాజరు

నీట్ పరీక్షకు 3,298 మంది హాజరు

నీట్ పరీక్షకు 3,298 మంది హాజరు