
ఉగ్రవాదులను ఉరితీయాలి
నిజామాబాద్ సిటీ: జమ్మూ–కాశ్మీర్లో ఇటీవల పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉరితీయాలని నగరంలోని మహాలక్ష్మినగర్ కాలనీవాసులు డిమాండ్ చేశారు.
ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఆదివారం మహాలక్ష్మినగర్ కాలనీ–2, తెలంగాణ పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని, అమాయక హిందువులపై దాడి చేసిన ఉగ్రవాదులను ఉరితీయాలని ముక్తకంఠంతో నినదించారు. కాలనీవాసులు మల్లేష్ రెడ్డి, శంకర్ గౌడ్, మూర్తి, కిరణ్ కుమార్, గంగాధర్, మల్లెపూల నర్సయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.