
ఆరుతడికి ఆదరణ ఏదీ?
ఖరీఫ్లోనూ పెరిగే అవకాశం లేదు
ఆరుతడి పంటలకు ఆదరణ దక్కకపోగా ఏడాదికేడాది వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మొత్తం పంటల సాగులో 83 శా తం వరి ఉండడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. వరిసాగు కారణంగా విద్యుత్ వినియోగం పెరగడంతోపాటు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్లోనూ ఆరుతడి సాగు విస్తీ ర్ణం పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.
ఇందల్వాయి: ఆరుతడి పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు వరి సాగు విస్తీర్ణం ఏడాదికేడాది పెరుగుతోంది. సన్నధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించడం, ఆరుతడి పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడంతో వరి సాగు అంచనాలకు మించి సాగవుతోంది. దీంతో ఆరుతడి సాగుకు ఆదరణ తగ్గిపోతోంది.
పంటల సాగులో భారీ అంతరం కారణంగా వాతావరణ సమతుల్యత దెబ్బ తినడమే కాకుండా ప్రభుత్వంపై ఆర్థికంగా పెనుభారం పడుతోంది. అంతే కాకుండా అపరాలు, నూనె గింజలు, కూరగాయల సాగు వేగంగా పడిపోయి, దిగుమతులపై ఆధారపడి వాటి ధరలు అమాంతం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వరి సాగు వివరాలు
2024–25 యాసంగి సీజన్లో జిల్లాలో 5,16,266 ఎకరాల్లో పంటలు సాగయ్యా యి. అందులో 4,27,723 ఎకరాల్లో అంటే పూర్తి సాగులో (83 శాతం) వరి పంట ఉండగా కేవలం 88,543 ఎకరాల్లో ఆరుతడి పంటలు (17 శాతం మాత్రమే) సాగయ్యాయి. 2023–24 యాసంగి సీజన్లో 95,757 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగుకాగా, ఏడాది వ్యవధిలోనే సుమారు ఏడు వేల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది.
మార్పు రావాలంటే..
వరి సాగుతో తాత్కాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక నష్టాలే ఎక్కువ అని రైతులకు అవగాహన కల్పిస్తూ ఆరుతడి పంటల సాగుకు కచ్చితమైన ప్రణాళికలు రూపొందించాలి. అందుకు అపరాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, మొక్కజొన్న, గోధుమ పంటల సాగును ప్రోత్సహించేందుకు వాటి మద్దతు ధరలను పెంచడమే కాకుండా సాగుకు అవసరమైన విత్తనాలు, సూక్ష్మబిందు సేద్యం పరికరాలు, పంట నూర్పిడి యంత్రాలను రైతులకు ఏటా రాయితీపై అందించాలి. ఆరుతడి పంటల సాగుతో కలిగే ప్రయోజనాలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి.
ఆరుతడికి బోనస్ అందించాలి
మా ఊరు ఎత్తయిన గుట్ట ల్లో ఉండటంతో నీటి లభ్య త తక్కువగా ఉంటుంది. అందువల్ల మేము వరి సాగు కుదరక ఎక్కువగా ప త్తి, మొక్కజొన్న, సోయా వంటి ఆరుతడి పంటలనే సాగు చేస్తాం. ప్రభుత్వం ఆ రుతడి పంటలను చిన్నచూపు చూడటంతో సాగు గిట్టుబాటు కావడం లేదు. ఇకనైనా ప్రభుత్వం ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులకు చేయూ తనందించాలి. – సింగిడి భాస్కర్, రైతు, దొన్కల్
అనుకూల వాతావరణం
జిల్లాలో ఆరుతడి పంటల సాగుకు అనుకూలమైన నేలలతోపాటు చక్కని వా తావరణ పరిస్థితులు ఉన్నా యి. అయినా రైతులు వరిసాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ఆర్మూర్ డివిజన్లో ఎక్కువగా ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. వరి సాగుకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించడంతో ఆరుతడి పంటల సాగు వేగంగా పడిపోతోంది. – గడ్డం సతీశ్రెడ్డి, దొన్కల్, మోర్తాడ్
పంట మార్పిడి లేకుండా అంచనాలకు మించి వరిసాగు కారణంగా విద్యుత్ వినియోగం పెరగడంతోపాటు విలువైన భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.
ఓవైపు నేల ఆరోగ్యానికి హానికరమైన రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడుతుండగా, మరోవైపు రాయితీతో కూడిన ఎరువులు, విద్యుత్ రూపంలో ప్రభుత్వానికి భారం పడుతోంది. రసాయన ఎరువులు భూమిలో కలవడం, భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రైతులు నీటి జాడ కోసం వందల ఫీట్ల లోతు బోరు బావులను తవ్విస్తున్నారు. అయినప్పటికీ నీరురాకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. వరి పొలాల నుంచి గ్లోబల్ వార్మింగ్కి కారణమైన మిథేన్ వాయువు అధికంగా వెలువడుతున్నట్లు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతికి.. ప్రభుత్వానికీ భారమే..!
ఏడాదికేడాది పెరుగుతున్న వరి సాగు విస్తీర్ణం
మొత్తం పంటల సాగులో
83 శాతం వరే..
పర్యావరణం, ప్రభుత్వంపై పెనుభారం
జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఏడాదికేడాది పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2025–26 ఖరీఫ్ సీజన్ పంటల ప్రణాళిక ఖరారుకాగా, జిల్లా వ్యాప్తంగా 5.21లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా వరి 4.32లక్షల వరి ఎకరాల్లో సాగయ్యే అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ లెక్కన ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు లేవు.

ఆరుతడికి ఆదరణ ఏదీ?

ఆరుతడికి ఆదరణ ఏదీ?