ఐడీసీఎంఎస్‌లో అనిశ్చితి..! | - | Sakshi
Sakshi News home page

ఐడీసీఎంఎస్‌లో అనిశ్చితి..!

Apr 28 2025 12:47 AM | Updated on Apr 28 2025 12:47 AM

ఐడీసీ

ఐడీసీఎంఎస్‌లో అనిశ్చితి..!

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): జిల్లా సహకార మార్కెటింగ్‌ సంస్థ (ఐడీసీఎంఎస్‌)లో అనిశ్చితి నెలకొంది. పాలకవర్గం గడువు ముగిసి రెండు నెలలు గడిచిపోయింది. పాలకవర్గాలకు గడువు పెంచకపోగా, అదనపు కలెక్టర్లను పర్సన్‌ ఇన్‌చార్జీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ వెంటనే చైర్మన్లు కోర్టును ఆశ్రయించగా, పాలకవర్గం గడువు పెంచాలని తీర్పునిచ్చింది. కానీ ప్రభుత్వం సపోర్టి ంగ్‌ ఆర్డర్‌ ఇవ్వకపోవడంతో రెండు నెలలుగా ఆర్థిక కార్యకలాపాలతోపాటు ఉద్యోగుల జీతాలు నిలిచిపోయాయి. ఇప్పటికై నా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

చైర్మన్‌లకు అనుకూలంగా తీర్పు?

ప్రభుత్వం ఎన్‌డీసీసీబీల పాలకవర్గాల గడువు పెంచినప్పటికీ.. ఐడీసీఎంఎస్‌ పాలకవర్గాలకు గడువు ను పొడిగించలేదు. పర్సన్‌ ఇన్‌చార్జీలుగా అదనపు కలెక్టర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీసీఎంఎస్‌ల చైర్మన్‌లు కోర్టును ఆశ్రయించగా, పాలకవర్గాల గడువు పొడిగించాలని చైర్మన్‌లకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. కానీ కోర్టు తీర్పునకు ప్రభుత్వం సపోర్టింగ్‌ ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. తీర్పు అమలు చేయడం లేదని మరోసారి చైర్మన్‌లు కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9డీసీఎంఎస్‌లలో పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది. కాగా ఆర్డర్‌ ఇవ్వకపోవడానికి గల కారణాలు అనేకమైనప్పటికీ.. సంబంధిత కమిషనర్‌ సెలవులో ఉన్నారని, రాజకీయ కారణాలనే ప్రచారం కూడా జరుగుతోంది.

రెండు నెలలుగా జీతాల్లేవు

డీసీఎంఎస్‌ పాలకవర్గం లేదా పర్సన్‌ ఇన్‌చార్జి కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రెండు నెలలుగా 20 మంది ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. నెలకు సుమారు రూ.6 లక్షల వరకు జీతాల రూపేణ చెల్లించాల్సి ఉంటుంది. చెక్‌ పవర్‌ జాయింట్‌గా ఉండటం, డీసీఎంఎస్‌ పాలకవర్గం లేదా పర్సన్‌ ఇన్‌చార్జి కొనసాగింపుపై స్పష్టత లేకపోవడం ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. జీతాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు సైతం రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి త్వరగా నిర్ణయం తీసుకుని జీతాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

పాలకవర్గమా? పర్సన్‌ ఇన్‌చార్జీనా..? స్పష్టత కరువు

చైర్మన్‌లకు అనుకూలంగా కోర్టు తీర్పు?

సపోర్టింగ్‌ ఆర్డర్‌ వెలువడక డైలమా

రెండు నెలలుగా నిలిచిన

ఆర్థిక కార్యకలాపాలు

ఉద్యోగులకు జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు

స్పష్టత రావాల్సి ఉంది

ప్రభుత్వం డీసీఎంఎస్‌కు ప ర్సన్‌ ఇన్‌చార్జీగా నియమించడంతో బాధ్యతలు స్వీకరించాను. జాయింట్‌ చెక్‌ పవర్‌ కారణంగా జీతాలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయింది వాస్తవమే. చైర్మన్లు కోర్టును ఆశ్రయించగా, అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిసింది. ప్రభుత్వం సపోర్టింగ్‌ ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంది. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

– కిరణ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌

ఉద్యోగులు.. విధులు

ఐడీసీఎంఎస్‌లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మేనేజర్‌ సహా 20 మంది ఉద్యోగులు, సిబ్బంది వి ధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం 20 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. దీనికితోడు మార్క్‌ ఫెడ్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా యూరియా, ఇతర ఎరువుల విక్రయాలు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, తదితర కార్యకలాపాలు కొనసాగుతుంటాయి.

ఐడీసీఎంఎస్‌లో అనిశ్చితి..! 1
1/1

ఐడీసీఎంఎస్‌లో అనిశ్చితి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement