మాదిగల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం | - | Sakshi
Sakshi News home page

మాదిగల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం

Apr 28 2025 12:47 AM | Updated on Apr 28 2025 12:47 AM

మాదిగ

మాదిగల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం

నిజామాబాద్‌ అర్బన్‌: ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం తెలిపి మాదిగల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి అని మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి అన్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఆదివారం నిర్వహించిన సమావే శంలో ఆయన మాట్లాడారు. మాదిగలంద రూ కాంగ్రెస్‌కు రుణపడి ఉండాలన్నారు. 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి మొద టి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో సహకరిస్తున్నారని అన్నారు. దేశంలోనే తె లంగాణ రాష్ట్రమే మొదట చట్టం చేయడం ఎంతో గర్వకారణమన్నారు. మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, గౌరవ అధ్యక్షు డు రాజ్‌గగన్‌, అధికార ప్రతినిధి మల్లాని శివ, హరీశ్‌, గంగాధర్‌ గైక్వాడ్‌, గణేశ్‌, సాయికాంబ్లే తదితరులు పాల్గొన్నారు.

ఎస్సారెస్పీలోకి

స్వల్ప ఇన్‌ఫ్లో

ఎగువ నుంచి 3,472 క్యూసెక్కుల వరద

పెరుగుతున్న నీటి మట్టం

బాల్కొండ: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కుర వడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. అకాల వర్షాలు కురవడంతో 3,472 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, ప్రాజెక్ట్‌ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 382 క్యూసెక్కుల నీరుపోతోంది. మిషన్‌ భగీరథ ద్వారా తాగు నీటి అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రం 1061.00 (11.54 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.

చెక్‌డ్యాం పనులు అడ్డగింత

మోపాల్‌: మండలంలోని తాడెంలో రూ.3.57 కోట్లతో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణ పనులను స్థానిక రైతులు ఆదివారం అడ్డుకు న్నారు. పనులు చేపట్టే క్రమంలో తమ భూ ముల్లోకి చొచ్చుకువస్తున్నారని రైతులు అ భ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ డీఈ బాలరాజు, ఏఈ శ్రీనివాస్‌, గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. భూమి సర్వే చేసిన తరువాతే పనులు చేపట్టాలని అప్పటి వరకు నిలిపివేయాలని పట్టుబట్టారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు జోక్యం చేసుకొని పనులను నిలిపివేయొద్దని రైతుల అవసరం మేరకు పనులు కొనసాగుతున్నాయని వారిని సముదాయించారు. తాము సోమవా రం వచ్చి హద్దులు గుర్తిస్తామని, అప్పటి వరకు పనులను అడ్డుకోవద్దని తహసీల్దార్‌ , సర్వేయర్‌ రైతులకు ఫోన్‌లో సూచించారు.

రేపు కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం

నిజామాబాద్‌ సిటీ: సంస్థాగత ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌ శ్రేణులకు జిల్లా కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వ హించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు మా నాల మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపా రు. డిచ్‌పల్లిలోని కేఎన్‌ఆర్‌గార్డెన్‌లో ఉద యం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రూరల్‌ ఎ మ్మెల్యే ఆర్‌ భూపతిరెడ్డి, బాన్సువాడ ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, నుడా చైర్మన్‌ కేశ వేణు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు, ఆర్మూర్‌ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, బాల్కొండ ఇన్‌చార్జి సునీల్‌రెడ్డి, బాన్సువాడ బాధ్యులు రవీందర్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

మాదిగల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం 1
1/2

మాదిగల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం

మాదిగల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం 2
2/2

మాదిగల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement