భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి

Apr 28 2025 12:47 AM | Updated on Apr 28 2025 12:47 AM

భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి

భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి

నిజామాబాద్‌అర్బన్‌: నిర్దిష్ట గడువు లోపు రైతుల భూ సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. నూతన ఆర్‌వోఆర్‌ చట్టంతో భూ రికార్డులను సవరణ చేసుకునే అ వకాశం కల్పించారన్నారు. నిజామాబాద్‌ నార్త్‌, సౌ త్‌ మండలాల పరిధిలోని రైతులకు అర్సపల్లి గ్రామ చావిడిలో ఆదివారం ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్‌ మాట్లాడారు. రైతులు తమ భూముల రికార్డులకు సంబంధించిన పొరపాట్లను స్థానికంగానే సరి చేసుకునేందుకు తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్లకు అధికారాలు ఇచ్చినట్లు తెలిపారు. చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిలోపు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మే, జూన్‌ మాసాల్లో గ్రామాలలో సదస్సులు ఏర్పాటు చేసి, భూ సమస్యలపై అధికారులు రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తారని తె లిపారు. క్షేత్రస్థాయిలో సర్వే, విచారణ జరిపిన త ర్వాతే భూమి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేయనున్నట్లు కలెక్టర్‌ వివరించారు. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ సమయంలో తప్పిదాలు చోటుచేసుకున్నాయని, స రైన న్యాయం జరగలేదని భావిస్తే సంబంధిత రైతు లు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారన్నారు. అప్పీలు చేసుకున్న పేద రైతులకు దేశంలోనే తొలిసారిగా ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో భూ మార్పుల రిజిస్టర్‌, చె రువులు, కుంటలు వంటి భూముల రిజిస్టర్‌, గ్రామ పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్లను నిర్వహిస్తారన్నారు. ఆధార్‌ తరహాలోనే భూకమతాల వారీగా భూధార్‌ సంఖ్య కేటాయిస్తారని, దీంతో భూ వివాదాలకు ఆస్కారం ఉండదని, ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. సదస్సులో ఇన్‌చార్జి ఆర్డీవో స్రవంతి, సౌత్‌, నార్త్‌ తహసీల్దార్లు బాలరాజు, నాగార్జున, రైతులు పాల్గొన్నారు.

పారదర్శకంగా భూముల వివరాలు

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement