
చిన్నారిని బలిగొన్న కూలర్
మాక్లూర్ : కూలర్ షాక్తో చిన్నారి మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలం చిక్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చిక్లికి చెందిన గడ్డం నవీన్ అర్చన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న అసెంబుల్డ్ ఐరన్ కూలర్ వద్ద తల్లిదండ్రులతోపాటు పెద్దకూతురు విహంకిత(5) నిద్రపోయింది. సుమారు 2 గంటల సమయంలో నిద్ర నుంచి మేల్కొన్న విహంకిత అకస్మాత్తుగా పక్కనే ఉన్న కూలర్కు తగలడంతో విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఇంటి దర్వాజ నుంచి వాకిట్లో పడిపోయింది. ఇంటి ఎదుట రహదారి గుండా వెళ్లేవారు గమనించి తల్లిదండ్రులకు తెలపడంతో విహంకితను హుటాహుటిన జన్నేపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. అప్పటి వరకు తమతో ఆడుతూ పాడుతూ గడిపిన కూతురు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.
విద్యుదాఘాతంతో బాలిక మృతి