
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్నాగారం: జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం నిజామాబాద్ జిల్లా మాలమహానాడు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా సభ్యుల సమక్షంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజ్, టీజీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కామారెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తీట్ల దయానంద్, ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వామిదాస్, జిల్లా తాజా మాజీ అధ్యక్షుడు ఆనంపల్లి ఎల్లయ్య సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా చొక్కం దేవీదాస్, ప్రధాన కార్యదర్శిగా నాంది వినయ్ కుమార్, కోశాధికారిగా రాజన్న, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, ఆసది గంగాధర్, మీర్జాపూర్ సాయన్న, కోటేశ్వర రావు, భోజన్న, సహాయ కార్యదర్శులుగా మక్కం గంగాధర్, రవీంద్రబాబు, నీరడి గంగాధర్, గంట చిన్నయ్య, సూర పోశెట్టి, బాలస్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శిలుగా అల్జాపూర్ నాగరావు, మోహన్ , సాంస్కృతిక కార్యదర్శిగా శ్రీనివాస్, పబ్లిసిటీ కార్యదర్శిగా దయానంద్ సొంకాంబ్లే, సభ్యులుగా గోపు మురళి, సుద్దులం సాయిలు, సల్ల బాలయ్య, బాలరాజు, బుచ్చన్న, పెద్ద బోర్గం మోహన్,రామచంద్రపల్లె ప్రభాకర్, వెంకటేష్, ఇప్ప సాయిలు, అలాగే సలహాదారులుగా అలుక కిషన్, దయానంద్, దండు చంద్ర శేఖర్, దండు రాజేంద్ర ప్రసాద్, స్వామి దాస్, గోపు ప్రభాకర్, శ్రీనివాస్ ఎన్నికయ్యారు.