
సాదాబైనామాకు మోక్షం
మోర్తాడ్(బాల్కొండ): తెల్లకాగితాలపై రాసుకున్న భూ విక్రయ ఒప్పంద పత్రాలకు భూ భారతి ద్వారా మోక్షం లభించనుంది. గత ప్రభుత్వం 2020లో సాదాబైనామాలకు దరఖాస్తులు సేకరించినా 2019 రెవెన్యూ చట్టం ప్రకారం పట్టాల జారీ సాధ్యం కాలేదు. ధరణి పోర్టల్లో ఆప్షన్ ఇచ్చినా చట్టంలో ఉన్న చిక్కులతో అదీ సాధ్యం కాలేదు. తాజాగా భూ భారతిలో మాత్రం ప్రత్యేక ఆప్షన్ ఇవ్వనుండడంతో ఇప్పటి వరకు జిల్లాలో పెండింగ్లో ఉన్న 25,345 దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం ఉంది.
పట్టా భూములకే అవకాశం
పట్టా భూములకు సంబంధించి సాదాబైనామాలు ఉంటేనే ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వనుంది. గతంలో పీవోటీ(అసైన్డ్) భూములకు పట్టాలను జారీ చేశారు. ఈసారి మాత్రం సీలింగ్, షెడ్యూల్డ్ ఏరియా, పీవోటీ చట్టాల పరిధిలో ఉన్న వాటిని మినహాయించారు. జిల్లాలో సాదాబైనామాలకు వచ్చిన దరఖాస్తులలో పీవోటికి సంబంధించినవే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భూ భారతిలో పీవోటీలకు సాదాబైనామా చేయకపోతే అనేక దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉండనున్నాయి. కాగా, సాదాబైనామాలకు సంబంధించి నోటీసులను ఆర్డీవో జారీ చేయనున్నారు. అఫిడవిట్ స్వీకరించిన తర్వాత ఆర్డీవోనే స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా సాదాబైనామా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్రయవిక్రయాలు పక్కాగా జరిగితేనే చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు.
భూ భారతిలో చట్టబద్ధత కల్పించే ఆప్షన్
జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో
25,345 దరఖాస్తులు