
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
లింగంపేట: మండలంలోని పొల్కంపేటకు చెందిన దామ ఎల్లయ్య(50)ను ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందినట్లు ఎస్సై వెంకట్రావు శుక్రవారం తెలిపారు. ఎల్లయ్య గురువారం సాయంత్రం నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో గ్రామానికి చెందిన సూరంపల్లి యాదగిరి అజాగ్రత్తగా ట్రాక్టర్ నడుపుతూ ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఎల్లయ్యకు తీవ్రగాయాలు కావడంతో కామారెడ్డికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య అక్కవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అగ్ని ప్రమాదంలో
మామిడి తోట దగ్ధం
మోర్తాడ్: భీమ్గల్ మండలం పురాణిపేట్ ఆశ్రమం వద్ద ఉన్న మామిడితోటలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చెట్లు, విద్యుత్ వైర్లు, పైప్లైన్కు, రెండు పంప్సెట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. తోటలో 170 చెట్లు పూర్తిగా కాలిపోయినట్లు తోట యజమాని రాజేశ్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ప్రమాదంలో రూ.20లక్షల నష్టం వాటిల్లినట్లు రాజేశ్ తెలిపారు.