వృథాగా వీధివిక్రయ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

వృథాగా వీధివిక్రయ కేంద్రాలు

Apr 26 2025 1:29 AM | Updated on Apr 26 2025 1:29 AM

వృథాగ

వృథాగా వీధివిక్రయ కేంద్రాలు

నిజామాబాద్‌ సిటీ: మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి లో కూరగాయల విక్రయాల కోసమే ప్రత్యేకంగా నిర్మించిన స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్స్‌ వృథాగా మారా యి. నగరంలోని హమాల్‌వాడీ, కోటగల్లీల్లో నిర్మించిన ఈ సముదాయాలు బిచ్చగాళ్లకు (యాచకుల కు) నిలయాలుగా మారాయి. పగటిపూట ఆకతాయిలకు అడ్డాగా.. రాత్రివేళ బిచ్చగాళ్లు నిద్రించేందు కు ఉపయోగపడుతోంది. బల్దియా నిర్మించిన ఉద్దేశం మాత్రం నీరుగారుతోంది.

రూ.10 లక్షలతో 25 గదులు....

ఇందూరులో రద్దీ ప్రదేశాల్లో ముందుగా పైలెట్‌ ప్రాజెక్టుగా రెండు ప్రదేశాలను ఎంపిక చేశారు. నాందేవ్‌వాడ చౌరస్తా, కోటగల్లీ (ఉషామయూరి థియేటర్‌ వెనుక)ల్లో రెండు కూరగాయల మినీ మార్కెట్‌ నిర్మించారు. ఇందుకుగాను మెప్మా నుంచి రూ.10 లక్షల నిధులు మంజూరు చేశారు. వీటిని నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ ఒకసారి కూడా కూరగాయలు విక్రయించలేదు.

మెప్మా నిర్లక్ష్యం...

స్థానికంగా ఉండే మహిళలు, ఇతర వీధి విక్రయదారులకు అవగాహన కల్పించాల్సింది మెప్మా సిబ్బందే. ముఖ్యంగా సీసీలు, ఆపై అధికారులు. వీరు నామ మాత్రంగానే పనులు నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. కేవలం డబ్బులు వచ్చే పనుల్లో మాత్రమే అత్యంత శ్రద్ధ చూపుతారన్ని పే రుంది. ముఖ్యంగా లోన్లు మంజూరు చేయించడం. ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన వాటిపై మాత్రం దృష్టి కేంద్రీకరించరు. దానికి ప్రత్యేక ఉదాహరణే వృథాగా మారిన ఈ వీధి విక్రయ కేంద్రాలు. ముందుగా పైలెట్‌ ప్రాజెక్టు కింద నిర్మించిన రెండు విజయవంతమైతే. నగరంలో మరిన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. నగరంలో ముఖ్యమైన కూడళ్లలో దాదాపు 10 వరకు వీధి విక్రయాలు నిర్మించాలన్నది లక్ష్యం. అయితే ముందుగా నిర్మించిన రెండు వృథాగా ఉండటంతో కొత్తవాటిని నిర్మించే వాటికి అడ్డంకిగా మారింది.

దుమ్ము, ధూళిలోనే అమ్మకాలు..

నగరంలో చాలా చోట్ల రోడ్లపైనే కూరగాయలు అమ్ముతున్నారు. రోడ్లు పక్కన, మోరీల వద్ద అనారోగ్యకర పదార్థాలు విక్రయిస్తున్నారు. అయినా ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో కొంటున్నారు.

గదుల్లో నిద్రపోతున్న యాచకులు

వ్యాపారులకు కేటాయించని అధికారులు

అవగాహన కల్పించని మెప్మా సిబ్బంది

జనాభాకు సరిపడా విక్రయ కేంద్రాలుండాలి

నగర జనాభాకు సరిపడా విక్రయ కేంద్రాలుండాలి. కూరగాయల కోసం గంజ్‌కు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితి ఉంది. నగరా నికి నలువైపులా, ప్రధాన గల్లీల్లో కూడా విక్రయ కేంద్రాలు నెలకొల్పాలి. ప్రజల అవసరాలు గుర్తించాలి. అధికారులు ఆ దిశగా అడుగులు వేయాలి.

– అరికెల సత్యనారాయణ, సుభాష్‌ నగర్‌

ముందుకు వస్తే మహిళా గ్రూపులకు కేటాయిస్తాం

నగరంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద రెండు స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్స్‌ నిర్మించాం. చాలా రోజులుగా వృథాగా ఉన్నాయి. గతంలో కేటాయిస్తామంటే కొందరు అడ్డుకున్నారు. ఇబ్బందులు పెట్టారు. స్థానిక నాయకులు ప్రోత్సహించలేదు. కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఎవరు ముందుకు వచ్చినా వెంటనే వారికి అప్పగిస్తాం.

– చిదుర రమేష్‌ గుప్తా, టౌన్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌

వృథాగా వీధివిక్రయ కేంద్రాలు1
1/4

వృథాగా వీధివిక్రయ కేంద్రాలు

వృథాగా వీధివిక్రయ కేంద్రాలు2
2/4

వృథాగా వీధివిక్రయ కేంద్రాలు

వృథాగా వీధివిక్రయ కేంద్రాలు3
3/4

వృథాగా వీధివిక్రయ కేంద్రాలు

వృథాగా వీధివిక్రయ కేంద్రాలు4
4/4

వృథాగా వీధివిక్రయ కేంద్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement