
హెడ్ కానిస్టేబుల్ కుమారుడికి సత్కారం
ఖలీల్ వాడి: జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న గోవిందరావు కుమారుడు సాయి చైతన్య సివిల్స్లో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్ సాధించారు. నిజామాబాదు పోలీస్ క్యాంప్ కార్యాలయంలో ఐఏఎస్ సాధించిన సాయి చైతన్యని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ని అభినందించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది 24/7 విధులు నిర్వహిస్తూ తమ పిల్లలను చక్కని చదువులు చదివించి ఉన్నత స్థాయి అధికారులు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. డిచ్పల్లి సీఐ మల్లేష్, రిజర్వ్ సీఐ శ్రీనివాస్(అడ్మిన్), తిరుపతి(వెల్ఫేర్) పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షకీల్ పాషా, తదితరులు పాల్గొన్నారు.
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి
నిజామాబాద్ సిటీ: మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడదామని ఐఎఫ్టీయూ నేత మచ్చ మోహన్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్గంజ్లో 139వ మేడే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. 50 సంవత్సరాలు దాటిన హమాలీ కార్మికులకు నెలకు రూ.6 వేలు పింఛన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక నాయకులు రాజు, రమేష్, మల్లేష్, శ్రీనివాస్, దాసు, జుబేర్, మునీర్, విజయ్, విట్టల్, కరీం పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ: మండల కేంద్రంలో మేడే వాల్ పోస్టర్లను ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. టీ యూసీఐ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడు తూ.. 139వ మే డే వేడుకలను విజయవంతం చేయాలన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పి కొట్టాలని కోరారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ నాయకులు దామోదర్, సాయారెడ్డి, బొర్రన్న, బాలకిషన్, సుజాత, సా యవ్వ, రాజవ్వ తదితరులున్నారు.

హెడ్ కానిస్టేబుల్ కుమారుడికి సత్కారం

హెడ్ కానిస్టేబుల్ కుమారుడికి సత్కారం