
ఊరికి దూరంగా.. నిరుపయోగంగా
ధర్పల్లి: వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి రైతులకు అధునాతన వ్యవసాయ పద్ధతులు వివరించడం, వారంతా ఒకే చోట సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో రూ.22 లక్షలు వెచ్చించి రైతు వేదికను నిర్మించారు. ధర్పల్లి మండలంలో ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటుచేసి రామడుగు, దుబ్బాక, ధర్పల్లి, హోన్నాజీపేటలో ఈ విధంగా నాలుగు చోట్ల రైతు వేదికలను ని ర్మించారు. ఇందులో కొన్ని గ్రామాలకు రైతు వేదిక లు దూరంగా ఉండటంతో రైతులు అక్కడికి వెళ్లడానికి ఆసక్తిని చూపడం లేదు. రైతు వేదికల నిర్వహణకు ప్రతి నెలా రూ.9 వేలను ప్రభుత్వం కేటాయించింది. ఈ మొత్తాన్ని తాగునీరు, విద్యుత్ బిల్లు, స్వీపర్, స్టేషనరీ ఇతర ఖర్చులకు ఉపయోగించాలి. ఇంతవరకు బాగానే ఉన్నా రెండేళ్లుగా రైతు వేదికల నిర్వహణ ఖర్చులకు నిధులు విడుదల కావడం లేదు. ప్రస్తుతానికి ఏఈవోలు రైతు వేదికల నిర్వహ ణ బాధ్యతలను చూస్తున్నారు. రైతులకు శిక్షణ సమయంలో తాగునీరు, స్టేషనరీ ఇతర ఖర్చులు ఏఈవోలకు ఇబ్బందిగా మారాయి.
వసతులు అంతంత మాత్రమే..
రైతు వేదికలు చాలా చోట్ల గ్రామాలకు దూరంగా ఉన్నాయి. ప్రహరీ గోడ, భద్రతా సిబ్బంది లేకపోవడంతో రైతు వేదికలోని సామగ్రిని ధ్వంసం చేయడం, ఎత్తుకెళ్లడం వంటివి జరిగాయి. రైతు వేదికల చుట్టూ పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల నీటి వసతి లేకపోవడంతో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎ రువులు, విత్తనాల పంపిణీ రైతు వేదికల్లో చేపట్టాల ని నిర్ణయించినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఇటీవల మండల కేంద్రాల్లోని రైతు వేదికలలో ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు సలహాలు సూచనలు తెలియజేస్తారు. కాని రైతులు ఈ కార్యక్రమంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రైతు వేదికలకు నిర్వహణ ఖర్చులు విడుదల చేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
నిర్వహణ భారంగా మారిన రైతు
వేదికలు
సౌకర్యాలు లేక తప్పని ఇక్కట్లు