
ప్రతి ఒక్కరికి ఉపాధి పని కల్పించాలి
సినిమాలు
జక్రాన్పల్లి: ఉపాధి పథకంలో ప్రతి ఒక్కరికి పని కల్పించాలని డీఆర్డీవో సాయాగౌడ్ సూచించారు. శుక్రవారం జక్రాన్పల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామి సామాజిక తనిఖీ నిర్వహించారు. పనులు చేయకుండానే పనులు చేసినట్లు మస్టర్లలో హాజరు వేసి డబ్బులు చెల్లించారని, ఈ డబ్బులు రికవరీ చేయాలని డీఆర్డీవో.. అధికారులను ఆదేశించారు. ఒక కుటుంబానికి ఒకే జాబ్ కార్డు ఉండేలా చూడాలన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటగా సగానికి పైగా ఎండిపోయాయని తెలిపారు. వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలన్నారు. సామాజిక తనిఖీలో ఆయా గ్రామాల్లోని చేపట్టిన పనులు, కూలీలకు చెల్లించిన డబ్బులు, నిధులు దుర్వినియోగం తదితర వివరాలను చదివి వినిపించారు. జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ, ఎస్ఆర్పీ రవి, ఎంపీడీవో సతీష్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బంగారం ధరలు (10గ్రాములు)

ప్రతి ఒక్కరికి ఉపాధి పని కల్పించాలి