
రాజ్యాంగ వ్యతిరేక వీడీసీలను నిషేధించాలి
నిజామాబాద్నాగారం: రాజ్యాంగ వ్యతిరేక వీడీసీలను నిషేధించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం పక్షాన ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో శనివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తాళ్లరాంపూర్లో గౌడ, గీతా కుటుంబాలను వీడీసీలు సాంఘిక బహిష్కరణ, మహిళలను గుడిలోకి రానివ్వకుండా అవమానపరుస్తున్నారని పేర్కొన్నారు. ఈతవనాన్ని తగలబెట్టడం లాంటి ఆటవీక, అనాగరిక చర్యలకు పూనుకున్న వీడీసీలను నిషేధించి, బాధ్యులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో వీడీసీల ఆగడాలు, అరాచకాలు మితిమీరి పోతున్నాయన్నారు. తాళ్లరాంపూర్ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు స్పందించకపోవడం సి గ్గుచేటని, ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నా యని ఆరోపించారు. ఈత వనం నష్టపరిహారం చె ల్లించాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. 25న చలో తాళ్లరాంపూర్ పేరిట ఆర్మూర్ ఆర్డీవో ఆఫీసు ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్ది వెంకటరాం, రమేశ్ బాబు, నూర్జహాన్, ప్రభాకర్, సుధాకర్, విఠల్ గౌడ్, న ర్రా రామారావు, బాస రాజేశ్వర్, విఠల్ రావు, బు స్సా శంకర్, అల్గొట్ రవీందర్, ధర్మేందర్, చంద్రశే ఖర్, సాయికుమార్, మాయావర్ రాజేశ్వర్, పద్మ, శ్యామ్, నీరడి లక్ష్మణ్, కోయేడి నర్సింలు గౌడ్, శ్రీరా మ్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో
ప్రజా సంఘాల ప్రతినిధుల డిమాండ్