
భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే
డిచ్పల్లి: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను జరుపుకున్నారు. నడిపల్లి ఫాస్టరేట్ సీఎస్ఐ చర్చి, బర్థిపూర్, విక్టోరియా హాస్పిటల్, కొరట్పల్లి, డిచ్పల్లి ఖిల్లా, దూస్గాం, ముల్లంగి(ఐ), ఘన్పూర్, కమలాపూర్, యానంపల్లి చర్చిలతో పాటు ధర్మారం(బి) గ్రామంలోని ప్రసిద్ద లూర్ధుమాత చర్చిలో గుడ్ ప్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు సందేశాలు విన్పించారు. పలువురు క్రైస్తవులు శిలువను మోశారు.
నిజామాబాద్ రూరల్: గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని శుక్రవారం నగరంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు శిలువ మరణానికి సంబంధించి క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే గుడ్ ఫ్రై డే ఆరాధన ఉపవాస దీక్షల మధ్య ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల నుండి తిరిగి ప్రారంభమైన ప్రార్థనలో సిలువపై యేసు మరణాన్ని గుర్తు చేసుకున్నారు.గుడ్ ప్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు సందేశాలు విన్పించారు.

భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే