కేసు పెట్టారు.. వదిలేశారు! | - | Sakshi
Sakshi News home page

కేసు పెట్టారు.. వదిలేశారు!

May 31 2025 1:20 AM | Updated on May 31 2025 1:20 AM

కేసు

కేసు పెట్టారు.. వదిలేశారు!

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: సామాన్యుడు చిన్న తప్పిదం చేస్తే, అది నిరూపణ కాకముందే యుద్ధప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించే అధికార యంత్రాంగం.. భారీ మాయాజాలం విషయంలో మా త్రం ప్రజాధనాన్ని రికవరీ చేయకుండా తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. దీనిపై సాక్షాత్తూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో అధికార యంత్రాంగాన్ని కడిగిపారేశారు. 2014–15 నుంచి 2022–23 సంవత్సరాలకు సంబంధించి నిజామాబాద్‌ జిల్లాలో 44 మిల్లుల నుంచి రూ.250 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 49 మిల్లుల నుంచి రూ.45 కోట్ల విలువజేసే సీఎంఆర్‌ రికవరీ చేయాల్సి ఉంది. ఇందులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ నుంచి రావా ల్సిందే రూ.60 కోట్ల మేర ఉండడం గమనార్హం. ఇందుకు సంబంధించి ఈ నెల 29న కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మంత్రి జూపల్లి ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లవుతున్న ప్పటికీ రికవరీ చేయకుండా నోటీసులిచ్చి వదిలేయ డమేమిటంటూ అసహనం వ్యక్తం చేశారు. షెడ్యూల్‌, యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకుని కేసుల మీద కేసులు పెట్టి ఆరు నెలల్లో రికవరీ చేయాలని ఆదేశించారు.

● సీఎంఆర్‌ విషయంలో బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు నిజామాబాద్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు మంత్రికి వివరించారు. దీంతో సంతృప్తి చెందని మంత్రి జూపల్లి రెండువారాల్లో పూర్తి వివరాలతో యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకుని అడ్వొకేట్‌ జనరల్‌తో కలిసి హైదరాబాద్‌లో సమీక్షకు రావాలని ఆదేశించారు.

● హైకోర్టు ఆదేశాలతో కేసు అయితే నమోదు చేశారు కానీ.. తదుపరి విచారణ, చర్యల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. బాధితుడి సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారణకు వచ్చిన హైకోర్టు తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో చేసినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా సదరు అధికారులను పోలీసు లు ప్రశ్నించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. కాలయాపన చేస్తే చాలు అన్నట్లుగా యంత్రాంగం వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. వందలకోట్ల ప్రజాధ నం అక్రమార్కులు బొక్కేస్తే ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై వాళ్లకు సైతం వాటాలు ముట్టినట్లు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.

● 2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్లకు గాను షకీల్‌కు చెందిన రహీల్‌, రాస్‌, అమీర్‌, దాన్విక్‌ అనే మిల్లుల పేరిట 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ మిల్లుల్లో ఒక్క గింజ ధాన్యం కూడా మిల్లింగ్‌ చేయలేదు. నేరుగా ధాన్యాన్ని అక్రమ మార్గంలో ముంబై, కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడు. కేవలం 5 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి ఇచ్చేంత పరిమాణంలో రీసైకిల్‌ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇచ్చాడు. ఓ 10 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రం ఏఆర్‌ ఇండస్ట్రీస్‌ (ఎడపల్లి), ఆర్‌కాం ఇండస్ట్రీస్‌ (వర్ని), అబ్దుల్‌ ఐ ఇండస్ట్రీస్‌ (ఎడపల్లి), ఎఫ్‌టీఎఫ్‌ ఇండస్ట్రీస్‌ (బోధన్‌) వాళ్లకు ఇచ్చినట్లు చూపించాడు. ఈ నాలుగు మిల్లుల యజమానులతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలవంతంగా ధాన్యం తీసుకున్నట్లు లేఖలు ఇప్పించాడు. షకీల్‌ ఒత్తిడితోనే లేఖలు ఇచ్చినట్లు సదరు మిల్లర్లు తెలిపారు. రూ.60 కోట్ల విలువ చేసే ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం షకీల్‌కు చెందిన మిల్లులకు రూ.10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటివరకు షకీల్‌ కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ ఇవ్వకపోవడంతో పాటు, జరిమానా సైతం కట్టలేదు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతూ కాలం గడిపారు. మరోవైపు బాధితుడు కిశోర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి కథ నడిపిన అధికారులే, సీఎంఆర్‌ సైతం కిశోరే ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం గమనార్హం.

అధికార దుర్వినియోగం

అధికారంలో ఉన్న సమయంలో..

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కోట్లాది రూపాయల విలువజేసే ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకుని ఒక్క గింజ కూడా మిల్లింగ్‌ చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు దందా చేశాడు. మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ధాన్యం ఇవ్వకుండానే కిశోర్‌ మిల్లు నుంచి సీఎంఆర్‌ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయించాడు.

సీఎంఆర్‌ రికవరీలో అధికారుల తీరు

ఒకరికి ధాన్యం ఇచ్చి..

మరొకరికి వేధింపులు

నిజామాబాద్‌ జిల్లాలో రూ.250 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.45 కోట్ల

విలువైన సీఎంఆర్‌ పెండింగ్‌

చివరికి ఇన్‌చార్జి మంత్రి నిలదీయాల్సిన పరిస్థితి.. అయినా రికవరీపై

అనుమానాలే..

సీఎంఆర్‌ విషయంలో ఉన్నతాధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో గత మార్చి 30న బాధితుడి పోరాటంతో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రస్తుతం సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న, గతంలో నిజామాబాద్‌ అదనపు కలెక్టర్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌, మాజీ డీఎస్‌వో చంద్రప్రకాశ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ నిఖిల్‌రాజ్‌లపై వర్ని పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 2022–23 సీజన్‌లో వర్ని మండలంలోని కిశోర్‌ అనే వ్యక్తికి చెందిన శ్రీనివాస రైస్‌మిల్లుకు కేటాయించిన ధాన్యం పంపించకుండానే పంపించినట్లు చూపించిన ఉన్నతాధికారులే, సదరు రైస్‌మిల్లు యజమాని సంతకాన్ని సైతం ఫోర్జరీ చేయించడం విశేషం. ధాన్యం మాత్రం మాజీ ఎమ్మెల్యే షకీల్‌ మిల్లుకు పంపించి, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను కిశోర్‌కు చెందిన శ్రీనివాస రైస్‌ మిల్లు నుంచి ఇవ్వాలని ఈ ఉన్నతాధికారులే ఒత్తిడి తేవడం గమనార్హం. దీంతో దిక్కుతోచని బాధితుడు కిశోర్‌ నెలల తరబడి న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది.

కేసు పెట్టారు.. వదిలేశారు!1
1/1

కేసు పెట్టారు.. వదిలేశారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement