
వెన్నునొప్పితో వెళ్తే ప్రాణాలే పోయాయి
నిజామాబాద్నాగారం: వెన్నునొప్పి చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ ఆపరేషన్ అ నంతరం కన్నుమూసింది. నగరంలోని ప్రతిభ ఆ స్పత్రిలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన రాధిక(35) వెన్నునొప్పితో బాధపడడంతో భర్త సురేశ్ ప్రతిభ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. పరీక్షించిన వైద్యులు వె న్నుపూసకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెల పడంతో సురేశ్ ఒప్పుకున్నాడు. గురువారం ఉద యం ఆపరేషన్ పూర్తి చేసి రాధికను వెంటిలేటర్పై ఉంచగా శుక్రవారం ఉదయం 8గంటల సమయంలో మరణించింది. కాగా, సీనియర్ వైద్యులు చే యాల్సిన ఆపరేషన్ను జూనియర్ వైద్యులు చేయడంతోనే రాధిక మృతి చెందినట్లు భర్త, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేస్తామని చెప్పి ప్రాణాలు తీశారంటూ బోరున విలపించారు. ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు వచ్చి మృతదేహా న్ని తీసుకొని బయటికి వెళ్లాలని చెప్పడంతో కు టుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే సమ యంలో మృతురాలి కుటుంబీకులు, బంధువులు, కుల సంఘాల ప్రతినిధులు, మీడియా, పోలీసులు ఆస్పత్రికి చేరుకోవడంతో శవాన్ని ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. అనంతరం రూ. లక్ష ఇస్తామని, మృతదేహాన్ని తీసుకెళ్లాలని బేరసారాలకు దిగడంతో కుటుంబసభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆపరేషన్ ఎలా చేశారో, కే షీట్, ఎమ్ఆర్ఐ తదితర వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కు టుంబసభ్యుల ఆందోళన, యాదవ సంఘం మహి ళా అధ్యక్షురాలు మంజుల యాదవ్ ఒత్తిడితో చివరకు రూ. 3లక్షల 20వేలకు రాజీకుదిరింది. మహిళ మృతి, కుటుంబసభ్యుల ఆందోళన విషయం తెలుసుకొని సిబ్బందితో కలిసి ప్రతిభ ఆస్పత్రికి చేరు కున్న నగర సీఐ శ్రీనివాస్రాజ్..బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లా ల్సి వచ్చింది. కాగా, రాధిక మృతదేహానికి పోస్టు మార్టం చేయిస్తే అసలు నిజాలు బయటికి వచ్చేవని స్థానికంగా పలువురు చర్చించుకున్నారు.
ఆపరేషన్ తర్వాత మహిళ మృతి
ప్రైవేటు ఆస్పత్రిలో రోజంతా హైడ్రామా
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ
కుటుంబీకుల ఆందోళన
ప్రాణానికి వెలకట్టిన
ఆస్పత్రి యాజమాన్యం

వెన్నునొప్పితో వెళ్తే ప్రాణాలే పోయాయి