నందిపేట మహిళలకు లక్‌పతి దీదీ అవార్డులు | - | Sakshi
Sakshi News home page

నందిపేట మహిళలకు లక్‌పతి దీదీ అవార్డులు

May 31 2025 1:06 AM | Updated on May 31 2025 1:06 AM

నందిపేట మహిళలకు లక్‌పతి దీదీ అవార్డులు

నందిపేట మహిళలకు లక్‌పతి దీదీ అవార్డులు

నందిపేట్‌(ఆర్మూర్‌): నందిపేట మండలానికి చెందిన ఇద్దరు మహిళలు లక్‌పతి దీదీ అవార్డులు అందుకున్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా స్వయం సహాయక మహి ళా సంఘ సభ్యుల కుటుంబాలను లక్షాధికారులను చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లక్‌పతి దీదీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలులో రాష్ట్రంలోనే నిజామాబాద్‌ జిల్లా మొదటిస్థా నంలో ఉండగా, లక్‌పతి దీదీలుగా రాష్ట్రం తరఫున నందిపేట మండలం సీహెచ్‌ కొండూర్‌ గ్రామానికి చెందిన మంగు లావణ్య, నందిపేటకు చెందిన మహ్మాదీ అజ్మిరీ బేగంలు ఎంపికయ్యారు. ఒడిశాలో శుక్రవారం నిర్వహించిన జాతీయ స్థాయి కాన్‌క్లేవ్‌లో ఆ రాష్ట్ర సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ చేతుల మీదుగా లావణ్య, అజ్మిరీలు అవార్డు అందుకున్నారు. కాగా, రాష్ట్రంలోనే నందిపేట మండల సమాఖ్య 100 శాతం అజీవిక రిజిస్టర్‌ నమోదులో ముందుండడంతో ఐకేపీ ఏపీఎం మాణిక్యం సైతం అవార్డు అందుకున్నారు. అవార్డు వచ్చేలా కృషి చేసిన డీఆర్డీవో సాయాగౌడ్‌, అడిషనల్‌ డీఆర్డీవో రవీందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు బందోబస్తు

ఖలీల్‌వాడి: జిల్లాలో వచ్చే నెల 3 నుంచి 13వ తేదీ వరకు కొనసాగనున్న పదో తరగ తి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా నిషేధిత ఆ దేశాలు జారీ చేస్తున్నామన్నారు. కేంద్రాల వ ద్ద సెక్షన్‌ 163 అమలులో ఉంటుందన్నారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడరాదని, సెంటర్‌ పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచాలన్నారు.

డిగ్రీ పరీక్షలకు

142 మంది గైర్హాజరు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షల్లో శుక్రవారం 142 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 32 పరీక్ష కేంద్రాల్లో 1,546 మంది విద్యార్థులకు గానూ 1,404 మంది హాజరైనట్లు తెలిపారు. ఉదయం జరిగిన 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షకు 337 మంది విద్యార్థులకు గానూ 319 మంది హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన 1వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 1,209 మంది విద్యార్థులకు గానూ 1,085 మంది హాజరైనట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement