
పరిశోధన కేంద్రం నుంచి మూడు కొత్త వంగడాలు
రుద్రూర్: రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త వంగడాలను సాగుకు విడుదల చేసినట్లు పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ టీ అంజయ్య వెల్లడించారు. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలం తర్వాత రుద్రూర్ చెరకు–81 (2013 ఆర్81/కోఆర్ 19141) రకంతోపాటు వరి లో ఆర్డీఆర్–1162, ఆర్డీఆర్–1200 రకాలను విడుదల చేశామన్నారు. వీటిని రైతులు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని కోరారు. నూతన వంగడాలను రూపొందించిన శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
అభ్యుదయ రైతులకు విత్తనాలు..
వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా ఉత్పత్తి చేసి న నాణ్యమైన విత్తనాన్ని ప్రతి గ్రామంలో మూడు నుంచి ఐదుగురు అభ్యుదయ రైతులకు అందజేసామని, ఈ కార్యక్రమాన్ని జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామాల వారీగా విత్తనం తీసుకున్న రైతులు సాగు చేసి పంట ద్వారా ఉత్పత్తి అయిన విత్తనాన్ని స్థానిక రైతులకు తక్కువ ధరకు అందజేయాల్సి ఉంటుందన్నారు. ఎంపిక చేయబడిన రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సల హాలు, సూచనలు అందజేస్తారన్నారు. జూన్ 3న విత్తన మేళా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో పరిశోధన కేంద్రం, కేవీకే శాస్త్రవేత్తలు రాజ్కుమార్, విజయ్కుమార్, సాయిచరణ్, రాకేశ్, దినేశ్, రమ్య, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.
వచ్చే నెల 3న విత్తన మేళా
పరిశోధన కేంద్రం అధిపతి టీ అంజయ్య