
చెరువు పనైతేనే వస్తాం!
జిల్లాలో ఉపాధి కూలీల వివరాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): వేసవి సీజన్ ప్రారంభమైనప్పటికీ గ్రామాల్లో ఉపాధిహామీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. చెరువుల్లో పూడికతీసే పనులు లేకపోవడంతో కూలీల హాజరు గణనీయంగా తగ్గిపోయింది. కొత్త పనులు చేసేందుకు కూలీలు అంతగా ఆసక్తి చూపకపోగా, చెరువు పనులైతేనే వస్తామంటున్నారు. దీంతో కూలీల హాజరును పెంచడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు తిప్పలు పడుతున్నారు. లక్ష్యానికి అనుగుణంగా పనిదినాలు పూర్తి చేయలేకపోతున్నారు. ఉపాధిహామీ పనుల్లో కొన్ని మార్పులు జరగడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. గతేడాది వరకు చెరువుల్లో పూడికతీత, కెనాల్ పనులు ఉండేవి. చెరువుల్లో గుంతలు తవ్వే పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు. వేసవిలో నాలుగు నెలలపాటు దండిగా ఉపాధి లభించేది. కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది నుంచి చెరువుల్లో పూడికతీసే పనులను రద్దు చేసింది. కేవలం ఫిష్ పాండ్లు, అడవులు, గుట్టల్లో కందకాల తవ్వకం అలాగే వ్యవసాయ భూముల అభివృద్ధి, ఇతర పనులు చేయడానికి అనుమతి ఇచ్చింది. అలవాటు లేని, ఎక్కువ శ్రమతో కూడిన ఈ పనులను చేయడానికి కూలీలు పెద్దగా ముందుకు రావడం లేదు. పోయిన ఏడాది ఇదే సమయానికి జిల్లా వ్యాప్తంగా రోజుకు 50వేల మందికి పైగా కూలీలు పనులకు రాగా, ఇప్పుడు 25వేలు కూడా దాటడం లేదు. ఒక్కోసారి కొన్ని గ్రామాల్లో పదిమందికి మించి రావట్లేదు. అదే విధంగా నూతన ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 29.60 లక్షల పనిదినాలు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతేడాది 50లక్షల పనిదినాలకు అవకాశం ఇచ్చింది. పనిదినాలు కూడా కోతకు గురయ్యాయి.
మండలాలు 27
గ్రామ పంచాయతీలు 530
జాబ్ కార్డులు 2.56 లక్షలు
కూలీలు 4.86 లక్షలు
రుద్రూర్ 310
డిచ్పల్లి 1020
నిజామాబాద్ 567
మెండోరా 308
మోపాల్ 525
కోటగిరి 536
చందూర్ 84
బోధన్ 384
మొత్తం 23164
నవీపేట్ 1649
కమ్మర్పల్లి 713
రెంజల్ 850
ధర్పల్లి 1034
వేల్పూర్ 846
సిరికొండ 1212
మోస్రా 189
వర్ని 809
ముప్కాల్ 249
ఎడపల్లి 603
మండలం హాజరైన కూలీలు
ఆర్మూర్ 1475
మోర్తాడ్ 724
మాక్లూర్ 2006
భీమ్గల్ 1787
ఇందల్వాయి 1310
జక్రాన్పల్లి 1173
బాల్కొండ 554
నందిపేట్ 1815
ఏర్గట్ల 432
బుధవారం మండలాల వారీగా హాజరైన కూలీలు