నిజామాబాద్ సిటీ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించాలని సిరిసిల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ అన్నారు. ఇందుకోసమే ‘జైబాపు–జై భీం–జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమం రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం ‘జైబాపు–జైభీం–జైసంవిధాన్ అభియాన్’ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానపరిచేలా చేసే చర్యలు, అప్రజాస్వామిక నిర్ణయాలను ప్రజలు వివరించాలన్నారు. తనను నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలకు ఇన్చార్జిగా వేసినందున తన బాధ్యతలను నెరవేరుస్తున్నాన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్హందన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నాయకులు రత్నాకర్, జావేద్ అక్రమ్, సంతోష్, గోపి, రేవతి, అబ్దుల్ ఏజజ్, రామకృష్ణ, చంద్రకళ, ఉష, విజయలక్ష్మి, విజయ్పాల్ రెడ్డి, వినయ్, యెండల కిషన్, జియా, నరేందర్ గౌడ్, లవంగ ప్రమోద్, సంగెం సాయిలు పాల్గొన్నారు.