నిజామాబాద్
శిథిలావస్థలో వంతెన
సాలూర మండలంలోని ఖాజాపూర్– హున్సా గ్రామాల మధ్య వాగుపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది.
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025
– 08లో u
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధినాయకత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 15 నెలల కిందట ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటివరకు కేబినెట్లో బెర్త్ లేదు. తాజాగా విస్తరణ సమయంలో రాష్ట్రస్థాయిలో వివిధ సమీకరణాలు ప్రభావితం చేస్తున్నందున జిల్లాకు కేబినెట్లో బెర్త్పై అన్ని వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వచ్చే నెల 3న మంత్రివర్గ విస్తరణ అని వార్తలు వస్తున్నప్పటికీ మళ్లీ ఏమైనా వాయిదా పడుతుందా అనే విషయమై గుబులు కలిగిస్తోంది. జిల్లా నుంచి కేబినెట్ బెర్త్ ఖరారైతేనే తమకు నామినేటెడ్ పదవులు దక్కే విషయంలో కచ్చితమైన ముగింపు వస్తుందని ఆశావహులు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ నిర్మాణాత్మక విషయాల్లో తన మార్క్ చూపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అనూహ్య నిర్ణయాలు ఉంటాయోననే ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.
రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఇటీవ ల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వి వరాలను సేకరించినట్లు తెలుస్తోంది. మీనాక్షి న టరాజన్ గత ఎన్నికలకు ముందు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి, జక్రాన్పల్లి మండలాల్లోని సిర్నాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, క లిగోట్, తొర్లికొండ, మండలాల్లో 60 కిలోమీటర్ల మేర రాజీవ్గాంధీ సంఘటన మిషన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేశారు. తరువాత ఆ ర్మూర్ మండలం చేపూర్, బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా వరకు పాదయాత్ర చేశారు. ఆమె ఇటీవల రాష్ట్ర పార్టీ ఇన్చార్జిగా వచ్చాక ఎమ్మెల్యే భూపతిరెడ్డి గురించిన వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన భూపతిరెడ్డి ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. కేసీఆర్తో విభేదించి మూడేళ్ల కాలపరిమితి ఉన్న ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. తరువాత కాంగ్రెస్లో పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. బలమైన ప్రత్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను ఢీకొట్టి ఒకసారి ఓడినా పట్టువదలకుండా పార్టీ నిర్మాణం చేసుకుని గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ క్రమంలో మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా ఆరా తీసినట్లు సమాచారం. భూపతిరెడ్డి పేరు సైతం కేబినెట్ బెర్త్ కోసం పరిశీలనలో ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
న్యూస్రీల్
భూపతిరెడ్డి వివరాలను సేకరించిన మీనాక్షి నటరాజన్..
15 నెలల ఉమ్మడి జిల్లా వాసుల నిరీక్షణ
ఫలించేనా?
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు వచ్చే నెల
3న ముహూర్తం ఖరారు!
సుదర్శన్రెడ్డికి బెర్త్ ఖాయమంటూ
సంకేతాలు
భూపతిరెడ్డి పేరును పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం
కేబినెట్లో బెర్త్ ఉత్కంఠ
కేబినెట్లో బెర్త్ ఉత్కంఠ