ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి

Mar 25 2025 1:52 AM | Updated on Mar 25 2025 1:47 AM

నిజామాబాద్‌అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌కుమార్‌, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డీపీవో శ్రీనివాస్‌, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌, మెప్మా పీడీ రాజేందర్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. మొత్తం 82 ఫిర్యాదులు రాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు

ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement