మద్నూర్(జుక్కల్) : విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని ట్రాన్స్కో డీఈ గంగాధర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో సోమవారం మూడు నూతన ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అధిక లోడ్ ఉండడంతో వోల్టెజ్ సమస్య వస్తుండడం, వేసవికాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా అవసరం ఉండడంతో అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్కో ఏడీఈ సంజీవన్రావ్, ఏఈ గోపికృష్ణ, సిబ్బంది స్వామి ఉన్నారు.
ఆకట్టుకున్న కుస్తీపోటీలు
బాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన కుస్తీపోటీలు ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మల్లయోధులు తమ ప్రతిభను చాటి బహుమతులు అందుకున్నారు. గ్రామంలో ప్రతి ఏటా పాడిపంట, ప్రజలు బాగుండాలని జాతర మహోత్సవం నిర్వహిస్తామని గ్రామకమిటీ అధ్యక్షులు పరిగె బాపురెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సంజీవ్రెడ్డి, సాయిలు, పర్వయ్య, దుర్గారెడ్డి, శ్రీనివాస్, వీరేందర్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
లొంకలో ఏసీపీ పూజలు
సిరికొండ: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం లొంక రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి సోమవారం సందర్శించారు. సిరికొండ మండల కేంద్రంలో ఉన్న ఈ ఆలయంలో ఏసీపీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గర్భాలయంలో పూజలు, శివలింగానికి రుద్రాభిషేకం చేపట్టారు. పురోహితులు నాగరాజు వారికి ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏసీపీ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఆలయం దట్టమైన అడవుల్లో ఎంతో మనోహరంగా ఉందన్నారు. ఎస్సై ఎల్ రామ్, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, రాజ్కుమార్రెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలి
విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలి