జక్రాన్పల్లి : మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన గన్న వర్షిణి భారత సాఫ్ట్బాల్ అండర్–15 సబ్జూనియర్ జట్టుకు ఎంపికై ంది. ఈనెల 25 నుంచి 30 వరకు తైవాన్లో జరిగే ఏషియన్ చాంపియన్షిప్ పోటీల్లో వర్షిణి పాల్గొననుంది. అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టు తరఫున వర్షిణి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో మునిపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. మాజీ సర్పంచ్ ముస్కు చిన్న సాయిరెడ్డి ఆదివారం వర్షిణిని సన్మానించారు. ఖర్చుల నిమిత్తం రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు నరేశ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఆస్తి పన్ను చెల్లించని
దుకాణాల సీజ్
బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించని పలు దుకాణాలను ఆదివారం బల్దియా అధికారులు సీజ్ చేశారు. అనిల్ టాకీస్ రోడ్డులోని కేకే సూపర్ మార్కెట్, లక్ష్మి అపార్ట్మెంట్లోని దుకాణ సముదాయాలతోపాటు మరో దుకాణ సముదాయాన్ని సీజ్ చేశారు. దు కాణాదారులు బల్దియాకు రూ.3,16,629ల ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్తి పన్ను చెల్లించకపోతే దుకాణాలను సీజ్ చేస్తామని, ఇంటికి తాగునీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు.