నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

Mar 23 2025 9:21 AM | Updated on Mar 23 2025 9:17 AM

సిరికొండ: అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేసేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ రవీందర్‌ తెలిపారు. సిరికొండ మండలం రావుట్ల, న్యావనంది గ్రామ 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రేకర్లను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. రావుట్ల గ్రామంలో ఇళ్లు, వ్యవసాయానికి ఒకే బ్రేకర్‌ ఉండడంతో సరఫరాలో సమస్య వస్తే మొత్తం ఫీడర్‌ లైన్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో వినియోగదారులకు అసౌకర్యం కలుగుతోందని, సమస్య నివారణకు కొత్తగా మరో బ్రేకర్‌ ఏర్పాటు చేశామన్నారు. న్యావనంది సబ్‌స్టేషన్‌లో నర్సింగ్‌పల్లికి కొత్త బ్రేకర్‌ను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో డీఈ ఉత్తమ్‌ జాడే, ఏడీఈ శ్రీనివాస్‌, ఏఈ చంద్రశేఖర్‌, డీసీసీ కార్యదర్శి ఎర్రన్న, డీలర్‌ రమేశ్‌, భాస్కర్‌, సామెల్‌, గంగారెడ్డి, దాసు, ప్రసాద్‌, ఏఎంసీ డైరెక్టర్‌ ముత్తెన్న, నరేందర్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలచంద్రం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement