అందరూ పన్ను చెల్లించాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

అందరూ పన్ను చెల్లించాల్సిందే..

Mar 23 2025 9:21 AM | Updated on Mar 23 2025 9:15 AM

పోచమ్మగల్లీలో తాగునీరు సరిగా రావడం లేదు. పైప్‌లైన్ల మరమ్మతులు చేపట్టడం లేదు. బోర్‌లు పనిచేయడం లేదు. బల్దియా సరఫరాచేసే తాగునీరు సరిపోవడం లేదు. అరగంట ఎక్కువసేపు నీరు సరఫరా చేయాలి. దుబ్బ ముస్లిం బస్తీలో నీరు సరిగా రావడం లేదు.

– గణేశ్‌ గౌతంనగర్‌, నాగరాజు పోచమ్మగల్లీ, లింబాద్రి బోర్గాం (పి), మాజిద్‌ మాలపల్లి, ధన్‌రాజ్‌ పోచమ్మగల్లీ, నూర్‌మహ్మద్‌ దుబ్బ, రవికుమార్‌ ఆదర్శనగర్‌.

మున్సిపల్‌ కమిషనర్‌: అవసరమైన చోట్ల పైప్‌లైన్‌ల మరమ్మతులు చేయిస్తాం. తాగునీరు సరిపోకపోతే ఫ్లో పెంచుతాం. అసలు నీరు సరఫరాకాని కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తాం. నీటిని వృథా చేయొద్దు. జాగ్రత్తగా కాపాడుకోవాలి. మున్సిపల్‌ ఈఈ మురళీమోహన్‌రెడ్డికి ఆదేశాలు జారీచేశాం.

ఎవరికీ మినహాయింపు ఉండదు తాగునీటి సమస్య లేకుండా చూస్తున్నాం

వీధి లైట్ల సమస్యను పరిష్కరిస్తాం డ్రెయినేజీలను శుభ్రం చేయిస్తాం

సాక్షి ‘ఫోన్‌ ఇన్‌’లో నిజామాబాద్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌

నిజామాబాద్‌ నగరంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మా రిందని, డ్రెయినేజీలను శుభ్రపర్చడం, పిచ్చి మొక్కలను తొలగించడం లేదని నగరా నికి చెందిన పలువురు మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌కు సమస్యలను ఏకరువు పెట్టారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌తో శనివారం ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ నిర్వహించగా, నగరవాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఉద యం 10 నుంచి 11 గంటల సాక్షి ఫోన్‌ ఇన్‌ కొనసాగగా, సుమారు 58 మంది ఫోన్‌లు చేసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సమస్యలను విన్న కమిషనర్‌

వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. – నిజామాబాద్‌ సిటీ

నీటిపన్ను ఒకేసారి రూ.7 వేలు కట్టమంటే ఎట్లాసార్‌.. ఐదేళ్ల నుంచి ఒక్కసారి అడగని అధికారులు ఇప్పుడు అకస్మాత్తుగా ఆరేళ్లకు సంబంధించి నీటి పన్ను కట్టమంటే ఎట్లాసార్‌..

– రాజ్‌కుమార్‌, ఖానాపూర్‌

మున్సిపల్‌ కమిషనర్‌ : నీటి పన్ను కూడా వెంటవెంటనే చెల్లించాలి. పెండింగ్‌లో ఉంచొద్దు. ఐదేళ్ల నుంచి పన్ను చెల్లించకుంటే ఎట్లా.. మున్సిపల్‌ నీటిని వాడుకుని పన్ను కట్టకుంటే ఎలా? మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ఎలాంటి మినహాయింపు ఉండదు.

వినాయక్‌నగర్‌ ప్రాంతంలోని 100 ఫీ ట్ల రోడ్డులో వీధిలైట్లు వెలగడం లేదు. పాంగ్రా, మాధవనగర్‌, ముబారక్‌నగర్‌, కేసీఆర్‌ కాలనీ, చంద్రశేఖర్‌ కాలనీల్లోనూ వీధిలైట్లు సరిగా వెలగడం లేదు. రాత్రివేళ బయటకు వెళ్లాలంటే పిల్లలు భయపడుతున్నారు.

– రమేశ్‌ బొబ్బిలివీధి, శ్రీనివాస్‌ ప్రగతినగర్‌, రవీందర్‌ స్కాలర్స్‌ స్కూల్‌, విఠల్‌ వంద ఫీట్ల రోడ్డు, శ్రీనివాస్‌రెడ్డి కోజా కాలనీ

మున్సిపల్‌ కమిషనర్‌: వీధిలైట్ల మెయింటెనెన్స్‌ను ప్రభుత్వం ఓ ఏజెన్సీకి ఇచ్చింది. కొన్ని చోట్ల ఇబ్బందులున్నాయి. చిన్న చిన్న మరమ్మతులు చేయిస్తాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం.

అందరూ పన్ను చెల్లించాల్సిందే..1
1/1

అందరూ పన్ను చెల్లించాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement