నిజామాబాద్ సిటీ: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల టౌన్ప్లానింగ్ విభాగంలో 14 మంది ఉద్యోగులు కొత్తగా విధుల్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ ము న్సిపల్ కార్పొరేషన్కు ఏడుగురు, బోధన్కు నలుగురు, ఆర్మూర్కు ముగ్గురిని నియమించింది. కొత్తగా వచ్చిన ఉద్యోగులు శుక్రవా రం ఆయా మున్సిపాలిటీల్లో జాయినింగ్ రిపోర్టు అందజేశారు. టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్లుగా విధులు నిర్వర్తించనున్నారు.
మహిళా సంఘాల ద్వారా విత్తనాల విక్రయం
● తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్
చైర్మన్ అన్వేష్రెడ్డి
నిజామాబాద్అర్బన్: వచ్చే ఖరీఫ్ సీజన్కు మహిళా సంఘాల ద్వారా వివిధ పంటల విత్తనాలు విక్రయించనున్నట్లు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా సంఘాల ద్వారా తెలంగాణ సీడ్స్కు సంబంధించిన విత్తనాలను రైతులకు సరఫరా చేస్తామన్నారు. మహిళా సంఘం ద్వారా సరఫరా అయిన విత్తనాలకు పంటల మేరకు అమ్మకపు ధర పై 1 నుంచి 8 శాతం వరకు సేవ చార్జీలను అందిస్తామని తెలిపారు. నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడంతో రైతులకు మే లు చేకూరడంతోపాటు మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించినట్లు అవుతుందన్నారు. సమావేశంలో డీఆర్డీవో సాయాగౌడ్, రీజినల్ మేనేజర్ రఘు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.
ఎల్ఆర్ఎస్ను
సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్అర్బన్: అనధికార లే–అవుట్ల క్రమబద్ధీకరణకు, ప్లాట్ల రెగ్యులరైజేషన్కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో సూచించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుందన్నారు. ఎఫ్టీఎల్, నిషేధించిన సర్వే నెంబర్లు మినహా ఎల్ఆర్ఎస్కు దరఖా స్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించినట్లు తెలిపారు. రుసు ము ఎంత అనేది ఎవరైనా తమ సెల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి పరిశీలించుకోవాలన్నారు. దరఖాస్తుదారులు ఈనెల 31లోగా ఫీజు చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందని తెలిపారు. రుసుము చెల్లించిన వారి దరఖాస్తును అధికారులు పరిశీలించి వెంటవెంటనే అనుమతి మంజూరు చేస్తారన్నారు.
డ్యూ లిస్టు ముందే
సిద్ధం చేసుకోవాలి
నిజామాబాద్ నాగారం: ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాల్సిన వారి జాబితా(డ్యూ లిస్ట్)ను ముందు రోజే సిద్ధం చేసి, లబ్ధిదారులందరికీ సమాచారం అందించాలని డీఎంహెచ్వో రాజశ్రీ సిబ్బందికి సూ చించారు. నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యా లయంలో శుక్రవారం వ్యాధి నిరోధక టీకాల విభాగం ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక టీకాల సూక్ష్మ ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. పీహెచ్సీల సిబ్బందికి పలు సూచన లు, సలహాలు చేశారు. అనంతరం ఆర్మూర్ ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తూ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందిన డాక్టర్ శ్రీకాంత్కు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎంవో డాక్టర్ అతుల్ నెగి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి అశోక్ సిబ్బంది పాల్గొన్నారు.
టౌన్ప్లానింగ్కు 14 మంది ఉద్యోగులు