డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో వడగళ్ల వాన బీభ త్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలను ప్రకృతి దెబ్బతీసింది. గురు, శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల దెబ్బకు రైతుల కష్టం నేలరాలింది. రాళ్ల వానతో సిరికొండ, ధర్పల్లి మండలాల్లో కోత దశకు వచ్చిన వరికి తీవ్ర నష్టం జరిగింది. వడగళ్ల ధాటికి వరి గింజలు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన వడ్లు, పసుపు పంట తడిపోయింది. మామి డి కాయలు రాలిపోయాయి. పంటలు దెబ్బతినడంతో రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పంటనష్టం లెక్కలు తీస్తున్నారు. శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వర్షాల భయానికి రైతులు ముందస్తు వరి కోతలకు వెళ్తున్నారు.
● ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో గురువారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు గ్రామాల్లో వరి నేలకొరిగింది. మామిడి నేలరాలింది. కల్లాల్లో ఆరబోసిన పసుపు రాశులు స్వల్పంగా తడిశాయి.
ధర్పల్లి : మండలంలోని హొన్నాజీపేట్, వాడి, మద్దుల్ తండా, గుడి తండా గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. పంట నేలకొరగడంతోపాటు వరి గింజలు రాలిపోయాయి.
సిరికొండ: మండల కేంద్రంతోపాటు మైలారం చిన్న వాల్గోట్, పెద్దట్ల్గోట్, పోతు నూర్, కొండూర్ తదితర గ్రా మాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూ డిన వర్షం కురిసింది. వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కొండూరు గ్రామంలో వడగళ్ల వాన కురవడంతో ధాన్యం రాలిపోయింది.
ఇందల్వాయి: మండలంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. ఆరబోసిన ధాన్యం తడవకుండా కాపాడేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు.
బాల్కొండ: నియోజకవర్గంలో గురువారం రాత్రి అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. ఉడికించి ఆరబెట్టిన పసుపు తడిసింది. శుక్రవారం ఎండ తీవ్రత ఉండడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.
ఇందల్వాయి: జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతుల్లో గుబులు పుట్టుకుంది. గతేడాది అకాల వర్షాలతో వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తుగా వరి కోతలు ప్రారంభించారు. గురువారం రాత్రి వర్షం కురవడంతో భయాందోళన చెందిన రైతులు.. శుక్రవారం ఉదయం వరికోత యంత్రాలను ఆశ్రయించారు. కాగా, వడగళ్ల వాన భయంతో గింజ పూర్తి పరిపక్వతకు రాకపోయినా వరి కోస్తున్నారు. ముందస్తు కోతలతో ధాన్యంలో తాలుశాతం పెరిగే అవకాశం ఉంది. దీంతో మిల్లర్లు రైతులను దోచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆదివారం వరకు వర్ష సూచన ఉండడంతో వేల ఎకరాల్లో పచ్చి వరిపైర్లను కోసే అవకాశం ఉంది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాలలో కురిసిన వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. రాజంపేట మండలం అర్గొండలో 21 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మాచాపూర్లో 9 మిల్లీ మీటర్లు, దోమకొండలో 8.9 మిల్లీ మీటర్లు, సదాశివనగర్లో 6.3 మిల్లీ మీటర్లు, లింగంపేటలో 6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. లింగంపేట మండలంలోని లింగంపల్లి(ఖుర్దు) గ్రామంలో పిడుగుపాటుకు రెండు గేదెలు, అదే మండలంలోని పోతాయిపల్లిలో మూడు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. తిమ్మారెడ్డిలో ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ స్తంభం విరిగిపడింది. పలుచోట్ల వరి పంట నేలకొరిగింది. మక్క, జొన్న పంటలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దోమకొండ శివారులో ఓ రేకుల షెడ్డు గాలికి కొట్టుకుపోయింది.
ముందస్తు కోతలు..
కామారెడ్డిలో పిడుగులు
జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం
సిరికొండ, ధర్పల్లి మండలాల్లో రాళ్లవాన
వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం
రెండు లక్షలు నష్టపోయా..
గతేడాది యాసంగిలో వ డగళ్ల వానకు వడ్లు మొ త్తం రాలిపోయాయి. దీంతో సుమారు రూ.2 లక్ష లు నష్టపోయా. ఈసారి కూడా అలాగే జరుగుతుందనే భయంతో ముందుగానే పంటను కోస్తున్నాం. పంటనష్టం తర్వాత ప్రభుత్వం ఇచ్చే పరిహారం కన్నా పచ్చివడ్లు అమ్మడం ద్వారానే డబ్బులు ఎక్కువ వస్తాయని భావిస్తున్నాం.
– నోముల వెంకట్రెడ్డి, రైతు, నల్లవెల్లి.
నేలరాలిన రైతుకష్టం
నేలరాలిన రైతుకష్టం
నేలరాలిన రైతుకష్టం
నేలరాలిన రైతుకష్టం
నేలరాలిన రైతుకష్టం
నేలరాలిన రైతుకష్టం
నేలరాలిన రైతుకష్టం
నేలరాలిన రైతుకష్టం
నేలరాలిన రైతుకష్టం