బాల్కొండ: పేద కుటుంబానికి పెద్ద కష్టమొచ్చింది. ఇద్దరు చిన్నారులూ జబ్బులతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెండోరా మండల కేంద్రానికి చెందిన ప్రదీప్, విజయ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు లక్షిత్(12) హైపర్ టెన్షన్, కూతురు శ్రీసాన్వీ(6) జంక్ఫిట్స్ వ్యాధితో మతిస్థిమితం కోల్పోయింది. ప్రతి నెల చిన్నారుల మందుల కోసం రూ.20వేలు ఖర్చవుతోంది. ఒక్కొక్కరి వైద్యానికి రూ.4లక్షల వరకు ఖర్చవుతాయని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పనిచేసే ప్రదీప్కు వచ్చే జీతం పిల్లల మందులకే సరిపోతుంది. దీంతో వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఫోన్ పే నంబర్ 99661 56006కు దాతలు ఆర్థికసాయం అందించాలని ప్రాధేయపడుతున్నారు.
చిన్నారులకు పెద్దజబ్బులు
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు