తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ వా ణిజ్య విభాగం నిర్వహించే జాతీయ సదస్సు బ్రోచర్ను వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడు తూ జూన్ 24న తెయూ వాణిజ్య విభాగం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ‘వికసి త్ భారత్ –2047 ట్రాన్స్ఫార్మెటివ్ రోల్ ఆఫ్ కా మర్స్’ అనే అంశంపై నిర్వహించే సదస్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వాణిజ్య విభాగం ప్రొఫెసర్ రాంబాబు, ప్రిన్సిపాల్ ప్రవీణ్, గంటా చంద్రశేఖర్, సంపత్, శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యశాల పోస్టర్లు..
తెయూ(డిచ్పల్లి): శోధ్ తెలంగాణ ఆధ్వర్యంలో పరిశోధన అంశంపై నిర్వహించనున్న రెండు రోజుల కార్యశాలను సద్వినియోగం చేసుకోవాలని వీసీ యాదగిరిరావు సూచించారు. తెయూలో కార్యశాల పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. తెయూ శోద్ కన్వీనర్ గుర్రపు శ్రీకాంత్ మాట్లాడుతూ పరిశోధక విద్యార్థులు కార్యశాలలో పాల్గొనేందుకు ఈ నెల 28వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.